13, మే 2011, శుక్రవారం

అసెంబ్లీ ఎన్నికలూ - ఫలితాలూ


ఎన్నికలూ  - ఫలితాలూ 

పశ్చిమ బెంగాల్ . తమిళనాడు, ఆస్సాం,కేరళ , పాండిచ్చేరి రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల  ఫలితాలు వచ్చేసాయి .
రిజల్టు తెలుసు - కాని ఎందుకలా జరిగింది? అన్న ఊహా గానాలకు - ప్రశ్నలకు, సరియిన సమాధానాలు చెప్పలేం.

గెలిచినా వారందరికీ - ఈ బ్లాగు శుభాభినందనలు.


బెంగాలు లో గెలిచిన మమతా బెనర్జీ గారిని అడిగితే - వొక్క విషయం చాలా బాగా చెప్పారు.


"నాలో వున్నా సర్వ అహంకారమంతా - నా కంటి నీటిలో తుడిచి పారేసేయ్యి" - అని. యిది రవీంద్ర నాథ్ టాగోర్ గారి పాట అట.

యిది నాకు - ఎన్నికల కంటే - ఎన్నికల  ఫలితాల  కంటే - చాలా బాగా నచ్చింది.

మన పాలకులంతా - యిది  ఎల్లప్పుడూ జ్ఞాపకం పెట్టుకుంటే - ఇండియా నందన వనం అయిపోదా? 

2 జీ లాంటి, సి డబ్లుయు జీ లాంటి స్కాములెందుకొస్తాయి ?

ముందు, ముందు - మమతా గారిలో - మమత ఎలా వుంటుందో నాకు తెలీదు.

కాని -  

ఎన్నికల  ఫలితాల తరువాత ఆమె చెప్పిన ఈ వాక్యం ఎల్లప్పుడూ - ఆమె మనసులో వుండాలని - దేవుడిని  అడుగుదాం.

అలా వుంటే - బెంగాల్ లో - మరో రవీంద్రుడు, మరో రామకృష్ణుడు పుట్టడానికి  అవకాశాలున్నాయి.

గెలిచిన మిగతా అందరూ - అలాగే వుండాలని కోరుతూ - 


= మీ

వుప్పలధడియం విజయమోహన్ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి