3, మే 2011, మంగళవారం

పం చ మహా యజ్ఞాలు -3 వ వ్యాసం - పితృ యజ్ఞం - మీకు "అదృష్టం" ఎలా వస్తుంది?

పం చ మహా యజ్ఞాలు -3 వ వ్యాసం 

పితృ యజ్ఞం 

ముందు వ్యాసాల్లో - 

దేవ యజ్ఞము, ఋషి యజ్ఞాలను  గురిం ఛి - చదివాము.

మూడవది పితృ యజ్ఞం.

యజ్ఞము - అం టే  "స్వార్థ రహితమైన, పరులకు వుపకారమైన" - కార్యము.

మనం మన కోసం చేసేది యజ్ఞం కాదు. పరుల కోసం చేసేదే యజ్ఞం.

ఈ యజ్ఞం చేయడానికి మనకున్న పరికరాలేమిటి?

మనకున్న ధన, ధాన్యాదులను- వొక పక్క నుంచితే -

మనలోనే నిక్షిప్తమైన మూడు అద్భుత శక్తులను  మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం వుంచుకోవాలి.

అవి -  మన జ్ఞాన శక్తి,  ఆలోచనా శక్తి,  క్రియా శక్తి.

ఈ మూడు శక్తులూ, వొకటిగా చేర్చి-  మనం చేసే పనులకు,  బలం చాలా  ఎక్కువ. ఫలితం చాలా ఎక్కువ. 

అందుకనే - మనం, "మనో, వాక్, కాయ, కర్మణా" - పని చేయాలని, మన అన్ని శక్తులూ వొకటిగా జోడించి, పని చేయాలని - మన ఋషులు చెప్పారు.

ఈ పంచ మహా యజ్ఞాలలో - దేవతలకు, ఋషులకు, పితృ దేవతలకూ, మిగతా  మనుషులకూ, భూత గణాలకు, జరిగే మేలు చాలా వున్నా- వారి ద్వారా - మనకు జరిగే మేలు అంతకంటే ఎక్కువ.

యిక - పితృ యజ్ఞం గురిం ఛి చూద్దాం. 
పితృ దేవతలంటే - చని పోయిన మన పూర్వీకులు మాత్రమే కాదు. 

బ్రతికి వున్న , మన తలిదండ్రులు - వారి సమానులు కూడా .

వారికి మనమిచ్చే గౌరవము, వారికి మనం చేసే సేవ, వారి పట్ల మనం ప్రదర్శించే శ్రద్ధా భక్తులు - యిదీ పితృ యజ్ఞమం టే.

మీరు, మీ పరిధిలో - మీ తల్లిదండ్రులకు , వారు ఉన్నప్పుడే, ఏం చేయగలరో - అవన్నీ చేసేయండి.
మన ఋషులు, గురువులు చెప్పడం ఎమిటంటే -  మీ పితృదేవతలు, బ్రతికి వున్నప్పుడు, వారిని సంతోష పెట్టండి.

ఏమేమి చేయ గలరో - అవన్నీ - చేసెయ్యండి. అది చాలా ముఖ్యం.

అందుకనే అన్నారు - మాతృ దేవో భవ; పితృదేవోభవ; ఆచార్య దేవో భవ - అని.
 
కానీ - ఈ కాలం లో , పెద్దవాళ్ళయిన కొడుకులతో వుండటానికే   - తల్లి దండ్రులు అంత యిష్టం చూపని పరిస్థితులు వస్తూ వుంది. తల్లిదండ్రులకు యిష్టం వున్నా- కొడుకుకో, కోడలికో - యిష్టం లేక పోవడమూ జరుగుతూ వుంది.  కొడుకులు, ఎక్కడెక్కడో - వుండడం వలన - యిద్దరికీ యిష్టం వున్నా, కలిసి వుండ లేని పరిస్థితులూ - వున్నాయి.

"వృద్ధాశ్రమాల" సంస్కృతి  అనివార్యమై పోతూ వుంది.

యిందులో - ఎవరి బాధ్యత ఎంత - అని వ్రేలెత్తి చూపడం - యిక్కడ కుదరదు - కాబట్టి -  మీరు ఏమేమి చేయగలరో, మీ బ్రతికి వున్న పితరుల సంతోషానికి - అవన్నీ చేసెయ్యండి - అని మాత్రము చెబుతున్నాను.
మీరు - ఏమేమి చేస్తారో - అవి - మీ పిల్లలు - భవిష్యత్తులో మీకు  చేసే అవకాశం కాస్త వుంది. 

తల్లిదండ్రులకు - ఏమీ చేయని వాడు - నేను సమాజనికి సేవ చేస్తాననడం - హాస్యాస్పదంగా వుంటుంది.

మీరు - ఏమి చేయగలరు ?


ప్రతి "మంఛి రోజు" కూ - వారికి నమస్కారం చేసి - వారి ఆశీర్వాదం పొందండి.  
 
మా నాన్న, మా అమ్మ నాకు ఎంత  చేసారో - అని వారు మీకు చేసిన త్యాగాలన్నీ - మీ భార్య / భర్త, స్నేహితులతో -
చెప్పండి. 

మీ అమా, నాన్నా ఎదురుగా కూడా చెప్పొచ్చు. వారిపై - మీకెంత గౌరవం వుందో, వారికీ తెలియనివ్వండి.

మీ ఆర్ధిక పరిస్థికి తగ్గని ఆర్ధిక పరిస్థితి - వారికి కలుగ జేయండి.

తల్లి దండ్రులతో -  ఎంత గౌరవం గా మాట్లాడినా -అది మీకు మేలే చేస్తుంది.

మీ తల్లిదండ్రుల - పితరుల గురిం ఛి తెలుసుకోండి. వారి పట్ల మీ గౌరవం తెలియచేయండి. వారి పేరు మీద - అన్న దానాలో, మరేదైనా - దానాలో - మీ తల్లిదండ్రులకు తెలిసేటట్టు చేయండి.
 
యిలా, మీరు ఎన్నో చేయొచ్చు. చేయాలని భావన రావాలి. అంతే. 

మన సంస్కృతిలో - సంవత్సరానికొక సారి - మరణించిన పితరుల కందరికీ పితృ యజ్ఞం జరిపే ఆనవాయితీ వుంది.

శ్రద్ధతో చేయాల్సిన కార్యం కాబట్టి - దాన్ని "శ్రాద్ధము" అన్నారు.

అది కాక, ప్రతి అమావాస్య నాడు - మన పితరులకు మాత్రమే కాక, చనిపోయిన అందరికీ - గౌరవం తెలిపే పద్దతిగా -  పితృ యజ్ఞం చేసే  పద్ధతి కూడా మనకుంది.  ఈ రోజుల్లో - మీకు తోచిన పద్ధతిలో - మీకు వీలున్న విధంలో - మీరు చెయ్యండి.
మనసు ముఖ్యం. మనసుం టే - మార్గాలెన్నో దొరుకుతాయి.

దీని వలన మీకేం లాభం. చాలా లాభాలున్నాయి. 

అదృష్టం - అనే మాట మీకు తెలుసు. 

కనిపించ కుండా -స్పష్టమైన కారణం తెలియకుండా -  మీకు వచ్చే లాభమే -  "అదృష్టం". 

అదృష్టమేనేది - మీకు ఈ పంచ మహా యజ్ఞాల వలననే  వస్తోందని  - మీకు తెలుసా?

దేవతలు - మిమ్మల్ని ఆశీర్వదిస్తే - మీకు   "అదృష్టం" వస్తుంది. 

ఋషులు, గురువులు - మిమ్మల్ని ఆశీర్వదిస్తే - మీకు   "అదృష్టం" వస్తుంది. 

మీ పితృ దేవతలు, మిమ్మల్ని ఆశీర్వదిస్తే - మీకు   "అదృష్టం"  వస్తుంది.

వొకరి "ఆశీర్వాదానికీ" -  మీ "అదృష్టానికీ"  - మీరు, మీ కనులతో  చూడ లేని - అతి పెద్ద లింకు   వుంది.

ఈ కాలం లో - పాశ్చాత్య దేశాలలో కూడా - "లా ఆఫ్ అట్రాక్షన్ " అనే వొక ప్రకృతి  ధర్మం పైన చాలా చర్చ జరుగుతూ వుంది. మీరు నిస్స్వార్థంగా అనుకునేది మీకు దగ్గరగా వస్తుందని - ఈ లా యొక్క సారాంశం.

నిజమే. యిది మన దేశంలో - మొదటి నుండి మనకు తెలుసు.

నిస్స్వార్థ  కార్యాలకు - దేవతలు - అంటే, ప్రకృతి శక్తులు "తథాస్తు" అంటారని,  మన శక్తికి వాటి శక్తిని జోడిస్తారని మనకు తెలుసు. అందుకే దేవ యజ్ఞం. శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు లాంటి దైవాంశ సంభూతులు కూడా -  దేవ యజ్ఞం చేసి గానీ - తమ పనులు మొదలు పెట్ట లేదు. అలాగే ఋషి యజ్ఞమూ, పితృ యజ్ఞమూ కూడా. వారి ఆశీర్వాదము - దేవతల ఆశీర్వాదానికి ఏ విధం గానూ తీసిపోదు.

మీరు - మీకోసం కోరే వాటికన్నా - మీ తలిదండ్రులు, మీ కోసం, కోరే వాటికి, బలం, ఫలితం, చాలా ఎక్కువ. వారు చేసేది, యజ్ఞం. మీరు చేసేది, మీరు అడిగేది - స్వార్థం.

యింకా యెంతో వుంది గాని -   మనసులో పడిపోతే - యిది చాలు. 

= మీ
వుప్పలధడియం విజయమోహన్


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి