2, మే 2011, సోమవారం

పంచ మహా యజ్ఞాలంటే ఏమిటి? అవి - ఎవరు, ఎప్పుడు, ఎందుకు చేయాలి?


పంచ మహా యజ్ఞాలంటే ఏమిటి?

    అవి - ఎవరు, ఎప్పుడు, ఎందుకు   చేయాలి?


భారతీయ సాంప్రదాయం లో - పం చ మహా యజ్ఞాలకు చాలా, చాలా ప్రాముఖ్యం వుంది. స్వార్థ రహితంగా చేసే, ఏ పని అయినా - యజ్నమనే చెప్ప బడుతుంది. ఈ స్వార్థ రహిత కార్యాలను - మన వాళ్ళు 5 రకాలుగా  విభజించారు.

మనిషిగా పుట్టిన ప్రతి వొక్కరు -  యివి చెయ్యాలి.

ఎప్పుడు ? ప్రతి రోజూ.

ఎందుకు - అనేది తరువాత వొస్తుంది.

పంచ మహా యజ్ఞాలు యివి - (1 )  దేవ యజ్ఞము (2 ) రుషి యజ్ఞము (3 ) పితృ యజ్ఞము (4 ) మనుష్య యజ్ఞము (5 ) భూత యజ్ఞము.

వీటిని గురించి - క్లుప్తం గా రెండు, మూడు వ్యాసాల్లో  చెబుతాను. 


 దేవ యజ్ఞము 

సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, వరుణుడు, భూమి, ఆకాశము, జలము, -లాంటి    ప్రకృతి శక్తులను - మనం దేవతలుగా చెప్పుకుంటాం. ప్రతి రోజూ - వారి నుండి  , వారి శక్తిని కొంత అడుగుతాం; వారు యిస్తారు.  ఆ శక్తితో మన పనులు మనం చేసుకుంటాం. ఆ శక్తీ అయిపోతుంది. మళ్ళీ అడుగుతాం. మళ్ళీ యిస్తారు. జీవితం యిలా జరిగిపోతూ వుంటుంది. ప్రతి నిముషం వారి పైన - మనం ఆధార పడి ఉన్నాము. 

రెండు నిమిషాలు, ముక్కు మూసుకుని కూర్చోండి. మీకు గాలి ఎంత అవసరమో - తెలిసి పొతుంది. 

వొక్క రోజు - నీళ్ళు తాగకుండా వుండండి. మీకు నీళ్ళ అవసరం తెలిసి పోతుంది. 

రెండు రోజులు - భోం చెయ్య కుండా వుండండి. మీకు, భూమి అవసరం ఎంతో తెలిసిపోతుంది. 

సూర్యుడి అవసరం, చంద్రుడి అవసరం, - అందరి  దేవతల  అవసరం మనకు తెలిసి పోతుంది. 

అయితే - ఆధునిక యుగంలో - మనకు తెలియనిది, ఆ దేవతలందరూ, మన మాట , మన ప్రార్థన వింటారని.  

ఆ దైవీక శక్తులకూ -  మన ప్రార్థనంటే  యిష్టమని.

మనం దేవ యజ్ఞం ప్రతి రోజూ చెయ్యాలి. దేవతలకు యివ్వవలసింది వారికి యివ్వాలి. చెయ్య వలసిన ప్రార్ధన చెయ్యాలి. ఉదాహరణకు - సూర్యుడికి సూర్య నమస్కారాలు చేస్తాము.తద్వారా - మన ఆరోగ్యం బాగుపడుతుందని మనకు తెలుసు. 

మీరు "ప్రహ్లాద్ జాని" గారిని గురింఛి విని వుంటారు.  

ఆయన - పూర్తిగా - సూర్య శక్తి ద్వారానే - తన ఆహారాన్ని సంపాదిం చుకుంటూ  వున్నారు. ఎన్నో ఏళ్ళు గా - భోజనం, నీళ్ళు లాంటివి తాకడము కూడా లేదు. 

ప్రహ్లాద్ జాని గురించి - వికిపీడియా లోను, చాలా వెబ్ సైట్లలోనూ - మనం చదువ వచ్చు.  ఇలాంటి వారు - చాలా మంది వున్నారు.

అంటే - సూర్య శక్తి ద్వారానే - భూమి కూడా - తన పనులు  తాను చెసుకుం టూ వున్నదని  తెలుస్తున్నది కదా.

సూర్యుడు మనకెన్నో యివ్వ గలిగిన సమర్థుడు. అడగ గలిగే - నేర్పు, వోర్పు, భక్తి  మనకుండాలి. అంతే. అలాగే - 

భూదేవి - మనకెన్నో యివ్వ గలిగిన సమర్థురాలు. చంద్రుడూ అంతే. వాయు దేవుడూ అంతే.  వాళ్ళను - ఎలా అడిగితే - ప్రసన్నులౌతారని, పతంజలి  మహర్షి తన యోగ సూత్రాలలో కూడా - విభూతి పాదం లో - చాలా బాగా చెప్పారు. మన ధ్యానానికి, ప్రార్థనకూ - చాలా, చాలా బలం వుంది.

మన సంస్కృతిలో - ఉదయం లేచిన వెంటనే-   కళ్ళు  తెరవకుండా, రెండు చేతుల తోనూ,  కళ్ళు మూసుకుని - క్రింది శ్లోకం చెబుతారు.

"కరాగ్రే, వసతే లక్ష్మీ, కర మూలే సరస్వతీ, కర మధ్యే భవేద్ గౌరీ, ప్రభాతే కర దర్శనం" 

అంటే - నా వేళ్ళ అంచుల లోనే - లక్ష్మీ దేవి వసిస్తూ వుంది. నా దగ్గరే లక్ష్మి దేవి వున్నప్పుడు - నాకం టే - భాగ్య వం తుడు ఎవరుంటారు. నేను, ఎవరికైనా సహాయం చేయడానికి - వీలుగా, నా వేళ్ళ అంచుల లోనే లక్ష్మీ మాత సర్వదా వసిస్తూ వుంది.

చేతి మొదటి భాగం లో - చదువుల తల్లి సరస్వతి వుంది.

చేతి మధ్యలో - అన్ని మంగళాలనూ,  శుభాలనూ - యిచ్చే తల్లి, సర్వ మంగళ -  గౌరీ దేవి వుంది.

అన్నీ వున్న వాడిని / దానను నేను - అన్న సంతృప్తితో తెల్ల వారి కళ్ళు తెరిచే సంప్రదాయం మనది.

సరే - మన పూజలు, వ్రతాలు ఎన్నో, ఎన్నెన్నో.

-పెద్ద, పెద్ద యాగాలూ, యజ్ఞాలూ కూడా -  ఈ కోవ లోకే వచ్చినా - మనం రోజు వారీ చేసే, ఈ చిన్ని యజ్ఞాలు ప్రకృతి శ క్తులైన - ప్రతి దేవతకూ - పరమ ప్రీతి పాత్రమైనవి.

అన్ని ప్రార్థనల లోను - అంతర్భాగంగా - అంతిమ భాగం గా మనం చెప్పే మాటలు, కోరే వరాలు  -

"సర్వే జనాః  సుఖినో భవంతు"  ;

"లోకాః సమస్తాః సుఖినో భవంతు" ;

యివి - మనం దేవతలనడిగే వరాలు.
దేవతలకు ప్రీతి పాత్రమైనవి - ప్రార్థన, పూజ, లాంటివి , వారికి సమర్పిం ఛి, వారిని మనం అడిగే యజ్న ఫలాలు యివి.

= వొక్కటి మాత్రం మనం జ్ఞాపకం వుం చుకోవాలి. 

ప్రపం చ యుద్ధానికైనా, తాజ మహాలు  కట్టాలన్నా మన మనస్సులో  వచ్చే దృఢమైన ఆలోచనలే పునాది.

దేవ యజ్ఞం - మం గళ కరమైన - అన్ని పనులకూ మనం వేసే గట్టి పునాది.

అది ఎప్పుడు చెయ్యాలి? యిప్పుడే. ఎప్పుడైనా. ప్రతి రోజూ.

 ముఖ్యం గా - ఉదయం; సాయంకాలం; రాత్రి పడుకునే ముందు.  నిర్మలమైన, నిస్స్వార్థమైన మనస్సుతో. 
అందరి కోసం

- అందరిలో మీరూ ఉన్నారుగా.  సకల శుభాలు మీకూ కలుగుతాయి.

.  .  . మరో యజ్ఞం, మరో వ్యాసంలో.

= మీ

వుప్పలధడియం విజయమోహన్ 

1 కామెంట్‌: