24, ఏప్రిల్ 2011, ఆదివారం

Anna Hazare= అన్నా హజారే = లోక్ పాల్ బిల్లు డ్రాఫ్టింగు కమిటీ = సభ్యులపై దుమ్ము / బురద చల్లేవారిని ఆపాలి = ఎలా ఆపాలి?


శ్రీకృష్ణ దేవ రాయల వారి కాలం లో - 
ఒక సారి - 
పెద్ద గిన్నె  లోకి  ప్రజలనంతా పాలు పోయ్యమంటే -
వొకరికి తెలియకుండా వొకరు - యిలా ప్రతి వొక్కరు -
గిన్నె లోకి - నీళ్ళు మాత్రమే పోసారట.


ఆంగ్లము  లో  కరప్షన్ అన్న పదానికి కల్మషము అని ముఖ్యమైన  అర్థము చెప్పు కో వచ్చు.

పాలు పొయ్య వలసిన చోట నీళ్ళు పొయ్యడము - మనస్సులో వున్న కరప్షనా కాదా? 

కానీ - అది ఆ కాలము.నీళ్ళు పోసారు. వొట్టి చెంబు పొయ్య లేదు.  బురద పొయ్య లేదు. విషం కలప లేదు.

అయినా  - ఈ కల్మషము చాల (లేదా  కొద్ది ) మంది మనుషుల్లో - కొద్ది, కొద్ది గా అప్పటినుండే వుందని మనకు తెలుస్తూ వుంది. 

ఈ కాలములో - ఈ కల్మషము - లంచగొండి తనము గా మారి - మూడు పువ్వులు, ఆరు కాయలుగా దిన దిన ప్రవర్ధమానమవుతున్న సంగతి  మన కందరికీ తెలుసు.

వందల నుండి, వేలు, వేల నుండి లక్షలు, లక్షల నుండి కోట్లు, కోట్ల నుండి వేల కోట్లు, మరి యిప్పుడు లక్షల కోట్లకు - ఈ లంచగొండి తనము ఎదుగుతున్న విషయము - మన కందరికీ తెలుసు.

లంచము తీసుకునే వారికి సిగ్గు, భయమూ రెండూ లేకుండా పోతున్న దన్న సంగతి కూడా మనకు తెలుస్తూ  వుంది.

ఈ ముళ్ళ చెట్టు పెరుగుదలను ఆపాలి - ఆపక పోతే ప్రమాదము చాలా, చాలా ధగ్గరికొచ్చేసిన్దన్న - మాట కూడా మనకందరికీ తెలుస్తూనే వుంది.

అన్నా హజారే గారి ఉద్యమము అందుకే.

ఈ సమయములో అన్నా హజారే గారి ఉద్యమానికి - చేయూత నివ్వ కుండా - 

సభ్యులందరిపైన- దుమ్ము , బురద చల్లడము - పాలు పొయ్య వలసిన చోట నీళ్ళు పొయ్యడము కాదా?

పోసే వారి ఉద్దేశము  ఏమిటి?

భారత దేశములో- కరప్షన్ మూడు పువ్వులూ, ఆరు కాయలు గా వుండాలనేనా?

ఆ చట్టము 42 ఏళ్ళు గా, మన పార్లమెంటు లో మగ్గుతూ వుంది. బయట లంచగొండి తనము పెరుగుతూ వుంది.

అయినా - ఆ కమిటీ వారిపై - అదీ యిప్పుడే - ఎప్పటి విషయానో లేవ దీసి బురదల్లే వారి అసలు ఉద్దేశము - తేట తెల్లమే గదా!  

మరి - వీరినెలా ఆపడము?

వొక్కటి.

గౌరవనీయులైన  మన ప్రధాన మం త్రి గారు -  ఈ సభ్యులందరికీ  కాబినెట్ మంత్రి ప్రతి పత్తి ని, హోదాని కలిగించి,  ఈ  సమయంలో, వారికి, మంత్రులకున్న - ఇమ్మ్యునిటీ  కలిగించాలి. వారిపై - చిల్లర కేసులు పెట్ట  గలిగే  పరిస్థితి తీసేయ్యాలి. 

అంతే కాదు. రెండవది ఏమిటంటే -

ఈ బురద చాల్లే వారు ఎప్పుడు ఆపుతారు? 

వారిపై కూడా - దేశము లోని ప్రతి వొక్కరు బురద చల్లాలి. అప్పుడే ఆపుతారు.

ఈ చట్టం వచ్చే వరకూ - సభ్యుల పై ఏ వొక్కరూ బురద చల్ల కుండా ఆపాల్సిన బాధ్యత అందరిపైనా వుంది.

తిట్ట వలసిన వాడిని, తిట్ట వలసిన సమయము లో  తిట్టక పోతే - కొట్టడానికి వస్తాడు. 

అర్జునా, గాండీవం ధరించు. అమ్ములను సంధించు. 

మిగతా పని నేనే చేసేస్తాను .  నువ్వు నిమిత్త మాత్రుడివే. అన్నాడు శ్రీకృష్ణుడు.

శ్రీకృష్ణుడు యిప్పుడూ ఎక్కడో, సిద్ధం గానే వుంటాడు. ప్రతి అర్జునుడూ తన  గాండీవాన్ని  ధరించాలి  మరి.

అహింసా పోరాటమయినా - అహింస గానే అయినా   -   పోరాటము జరగాలి కదా?


లంచగొండి తనము పైన పోరాడే వాళ్ళను కాపాడక పోతే -

లంచగొండి తనము పై పోరాటము వుండదు.

యిందులో - మీ వంతు మీరు చేస్తున్నారా? ....  చేస్తున్నారా? ... చేయండి సార్.

 అదండీకథ .

= మీ

వుప్పలధడియం   విజయమోహన్   

1 కామెంట్‌: