27, ఏప్రిల్ 2011, బుధవారం

అన్ని రహదారులూ ప్రశాంతి నిలయం వైపే.= సత్య సాయి బాబా వైపే - భాష్పాంజలులతో



అన్ని రహదారులూ రోము నగరానికే వెళ్ళుతాయి.

యిది ఆ దేశపు సామెత. ఆ కాలపు సామెత.


ఈ రెండు, మూడు  రోజులుగా -

మన దేశం లో  -

అన్ని రహదారులూ ప్రశాంతి నిలయం వైపే. 

కోట్ల ప్రజానీకం మనసులంతా  - సత్య సాయి బాబా వైపే.

వొక మహనీయుడు  మరి లేదంటే - గుండె లోతుల్లో - ఎక్కడో-
ప్రతి వొక్కరికీ , వొక వెలితి  తెలియడం అతి సహజంగా కలుగుతుంది.
కంట తడి పెట్టడం తమకు తెలియకుండానే జరుగుతుంది.

రాజకీయ నాయకులను వొక పక్క పెట్టండి.

వొక గవాస్కరు, వొక  టెన్డుల్కరు - కంట తడి పెట్టడం మీరు ముందు చూశారా. 

వారు వోడినప్పుడు కూడా  లేదు.

మరి ఈ రోజు!!

వారూ, మీరూ కంట తడి పెట్టారు కదా. 

వచ్చిన లక్షలాది మంది కంట తడి మనం మరి చూడ గలమా.

వారి గుండె ఆరాటాన్ని మరి విన గలమా!

ఆ కంట తడే సత్య సాయికి మన మౌన, శ్రద్దాంజలి.  


అందరి భాష్పాంజ లులతో - 

ఆ మహనీయుడికి 

మన నివాళులర్పిద్దాం 


= మీ

వుప్పలధడియం విజయమోహన్ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి