24, ఏప్రిల్ 2011, ఆదివారం

సత్య సాయి బాబా - దివంగతులైనారు - కానీ - ప్రశాంతి నిలయము గా ఉన్న మనస్సులో - వారు - ఎప్పటి లాగే , ఎప్పుడూ వుంటారు

సత్య సాయి బాబా 85 ఏళ్ళ వయసులో - 

దివంగతులైనారు.

వారు అప్పుడున్నదీ అనంతపురమే. 

వారు, యిప్పుడున్నదీ "అనంత" పురమే.

వారి నివాసము అప్పుడూ ప్రశాంతి నిలయమే. 

యిప్పుడూ - ప్రశాంతి నిలయమే.


వారు చేసిన -ప్రజోపయోగ కార్యాలు - అన్నీ, యిన్నీ కావు.

వారు చెప్పిన మంచి మాటలు అన్నీ, యిన్నీ  కావు.

వారు  భక్తుల మనసులలో - 

మొలకెత్తించిన  భక్తి భావనలు అన్నీ యిన్నీ కావు.

"సంభవామి యుగే, యుగే" - అన్నట్టు మళ్ళీ వారొస్తారు.

భక్తుల కోసం - అందరి కోసం -  మళ్ళీ వారొస్తారు.

అంత వరకు - భక్తుల మనస్సులో - ఎప్పటి లాగే వుంటారు.

మనస్సు - ప్రశాంతి నిలయము గా ఉన్నంత వరకు - వారందులో - ఎప్పుడూ వుంటారు .

వారి లాగా ప్రశాంత మైన ముఖాలతో,  వారి లాగా చిరునవ్వుతో - వున్న   వారందరిలో - వారు - ఎప్పుడూ వుంటారు 

= నమస్సుమామ్జలులతో

వుప్పలధడియం విజయమోహన్  
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి