1, జూన్ 2011, బుధవారం

బాబా రాందేవ్ జీ = అన్నా హజారే = మన్ మోహన్ సింగు = మనం

నేనూ బాబా రాందేవ్ జీ   గారి హైదరాబాదు  "యోగ శిబిర్" లో వారం రోజుల పాటు   యోగ శిక్షణ పొందిన వాడినే. 

వారి దగ్గర  నేర్చు కున్న  ప్రాణాయామాలు, ఆసనాలు, ధ్యానము యిప్పటికి చాలా ఏండ్లుగా సాధన చేస్తూ వున్న వాడిని. నేనే కాదు, నా భార్య కూడా నేర్చుకుని సాధన చేస్తూ వుంది. 

సరే. నేను - యింకా కొంత  మంది  గురువుల దగ్గర కూడా "యోగ సాధన" లోని చాలా పద్ధతులు, మెలకువలు నేర్చుకున్నాను.

అయినా - నా అభిప్రాయం ప్రకారం - ఆరోగ్య సాధన కు  - బాబా రాందేవ్ జీ గారి పద్ధతే చాలా బాగుంది.  మీ రోగాలన్నీ తప్పకుండా తగ్గుతాయని ఆయన యిచ్చే ఆశ్వాసనే మనలో సగం రోగాల్ని మాయం చేస్తుంది. ఎంత దీర్ఘ రోగి అయినా ఆయన పలుకులు, ఉపన్యాసాలు విని - వొక యోగా శిబిర్ వెళ్లి వస్తే - తప్పకుండా, ఆయన పద్ధతులు వాడుతారు. దాని సత్ఫలితాలు తప్పకుండా పొందుతారు. దీనికి తోడు, ఆయుర్వేదం. 

మహాత్మా గాంధీ గారి తర్వాత - యింత ఎక్కువగా "భారత్ దర్శన్" నిజంగా చేసిన వారు -  నాకు తెలిసి బాబా రాందేవ్ జీ  గారు మాత్రమే.యింత మంది ప్రజలకు ఆశ్వాసమిచ్చిన  వారూ ఆయన వొక్కడే.

ఆయన అభిప్రాయంలో - మన దేశం లో వున్న నల్లధనం, మన దేశం వెలుపలికి వెళ్ళిన నల్ల ధనం బయటికి వస్తే - మన దేశం - బాగా ధనవంతమైన దేశం గా మారిపోతుంది. యిది జరిగితేనే - నిజమైన లంచగొండులను కనిబెట్ట వచ్చు. వారి అక్రమాస్తులను ప్రభుత్వం స్వాధీన పరుచుకోనూ వచ్చు.      

అన్నా హజారే గారు జరుపుతున్న ఉద్యమం కు ముందునుండే   - రాం దేవ్ జీ  గారు - ఈ విషయాలను గురిం ఛి తన యోగ శిబిర్ లలో  మాట్లాడే వారు.
మనది వొక రకం గా నిద్ర పోతున్న దేశం. ప్రజలను నిద్ర నుండి మేల్కొలపాలి. మనకు శారీరక ఆరోగ్యమే కాదు. మానసిక ఆరోగ్యమూ, ధైర్యం రెండూ రావాలి. 

మన పాలక వర్గం యొక్క మానసిక ఆరోగ్యమూ బాగు పడాలి. వారికీ -చట్టం  పైన, న్యాయం పైన గౌరవం  రావాలి. Yippudavi చాలా మంది లో తక్కువని తెలుస్తూనే వుంది కదా. 
డబ్బు కున్న విలువ - నిజమైన మానవ విలువలకు లేక పోయింది. 

అందుకే రాం దేవ్ జీ గారు నడుం కట్టారు.వారికీ - అన్న హజారే గారికీ - మన  బలాన్నీ కలుపుదాం.

నా ఉద్దేశంలో - మన - ఇప్పుడున్న ప్రధాన మంత్రి, మన్ మోహన్ సింగు గారి ఆధ్వర్యంలో - యిటువంటి చాలా మార్పులు జరిగే వీలున్నది. 

వ్యక్తిగతంగా - ఆయన చాలా, చాలా, మంచి, గౌరవనీయ, ధార్మిక  వ్యక్తి. అటువంటి వ్యక్తులకు ప్రజలు డైరెక్టు గా వోటు వేసి గెలిపిస్తే - ఈ దేశం సులభం గా బాగు పడుతుంది.  కానీ అది జరుగదు. మనం, కుల, మత, పార్టీ ల లాంటి  ప్రాతిపదికల పైనే వోటు వేసి, వేసి, అలవాటు పడ్డాం.

అయినా - ఆయన ప్రధాన మంత్రి కావడం కొంత అదృష్టం. ఈ సమయంలో యిన్ని స్కాములు బయటికి రావడం, దీనికి అన్నా హజారే గారు, రాందేవ్ జీ గారు ముందుకు వచ్చి పోరాడడమూ అదృష్టమే. మన్ మోహన్ గారి కున్న రాజకీయ శ్రుంఖలాలు  కొన్ని - యిప్పుడు తొలిగి  పోవచ్చు.
యిది తరుణము.. విడిచినన్ దొరకదు. అన్న పాత పాట ప్రకారం - ఈ సమయంలో ప్రజలదరూ - కలిస్తే - వీరికి చేయూత నిస్తే -  వీరితో బాటు కలిసి - మన్ మోహన్ సింగు గారు - కావలసిన చట్టాలు తీసుకొస్తారని మనం నమ్మ వచ్చు. చేయవలసిన  విచారణలూ జరుగుతాయి. ఇది కాక - మన సుప్రీం కోర్టు వారు కూడా - ఈ విషయంలో గట్టిగా నిలబడుతున్నారు  కాబట్టి - 

అన్నా - రాం - మన్ మోహన్ గార్ల కలయికలో చాలా గొప్ప మంచి  దేశానికి జరుగుతుందని ఆశిద్దాం. వారికి - మన చేయూత నిద్దాం. 

ఈ సమయం - దేశం మంచి కోరే ప్రతి వొక్కరు మాట్లాడ వలసిన సమయం.  మాట్లాడండి మరి. పై ముగ్గురిని - సకారాత్మకం గా కలపడమే మన పని. మిగతాది - వారే చేసేస్తారు.


= మీ

వుప్పలధడియం విజయమోహన్

1 కామెంట్‌:

  1. మన్మోహన్ సింగ్ గారు మంచి వ్యక్తే కానీ ఆయన వెనకల ఉన్న అసలు శక్తితోనే అసలు సమస్యంతా.

    రిప్లయితొలగించండి