2, మే 2014, శుక్రవారం

ఎన్నికలు -2014- 1950 నాటి పద్ధతులు-ఈ నాటి టెక్నాలజీకి,వోటర్లకు ,తగినట్టుగా వుందా?. ఎన్నో మార్పులు రావాలి

ఎన్నికలు -2014


ఎన్నికలు  జరిగి పోతూ వున్నాయి. మరో పదిహేను రోజులలో అంతా అయిపోయి నట్టే . తరువాత -  ఎన్నికల ఫలితాలు వచ్చేస్తాయి . జూన్ నెలలో క్రొత్త ప్రభుత్వాలు రాష్ట్రాలలోను, కేంద్రంలోనూ వచ్చేస్తాయి .

ఎవరొస్తారో ? ....యెవరికి తెలుసు . 

తెలుసు అనే వాళ్ళ లోనూ,   మేమే గెలుస్తాం అనే వారి లోనూ కూడా గుండె దడ వుండనే వుంటుంది . మరి మేమే వోడిపోతాం -అని నిశ్చయించుకున్న వారి మనసు ఎలా వుంటుంది ?

ఎదుటి  వారిని , గెలిచే వారిని , ఎలాగైనా , ఏదో వొక చిక్కుల్లో యిరికించి పోదామని వుంటుంది .

యిప్పుడు కాంగ్రెస్ అలాగే చేస్తూ వుంది . యిప్పుడు కాంగ్రెస్ చేస్తూ  వున్న ఏ పని లోనూ నిజాయితీ , హుందా తనం కనిపించడం లేదు .

పదేళ్లుగా లోక్ పాల్ కావాలి అని ఉద్యమాలు జరిపిన వారందరినీ - ఎన్నో రకాలుగా వేధించిన కాంగ్రెస్ - యిక పది రోజుల్లో ఎలెక్షన్లు ముగిసిపోతుండగా ,  యిప్పుడు ఎవరితోనూ చర్చలు కూడా జరపకుండా , లోక్ పాల్ ను మేము పెడతాము - అనడం, హాస్యాస్పదం .

అలాగే మరెన్నో అప్పాయింట్ మెంట్లు చేస్తూ వుంది . స్నూప్ గేట్ అని పేరు పెట్టి - ఏమీ లేనిది , ఏదో జరిగిందని ఏదో చీమను భూతం లాగా చూపించడం , దానికి ఏ జడ్జీ యింతవరకూ - మేము వొప్పుకోము అన్న తరువాత కూడా - ఎవరో వొక జడ్జీని - ఎన్నికల ముందు పెడతాము -అనడం   విచారకరం ; హాస్యాస్పదం .  

మిగతా ఎంతో మంది జడ్జీలు ఎందుకు నిరాకరించారో  మొదట కాంగ్రెస్ చెప్పాల్సి వుంది . 

 లంచగొండి  తనం వొక ప్రక్క వున్నా - రాజకీయ ప్రత్యర్థులను యిలా ఎదుర్కొనడం , యిలా అనుకోవడం  కూడా  అంత కంటే, చాలా శోచనీయం .


కాంగ్రెస్ ఈ  పధ్ధతి మానుకుంటే  మేలు . లేకుంటే - వచ్చే అయిదేళ్ళలో , బీ . జే . పీ  కూడా అలాంటి పద్ధతే  పాటించితే - అది తప్పెలా అవుతుంది ?

మొత్తానికి రాజకీయాలను ఎంత కల్మషంగా మార్చాల్నో , అంత కల్మషం గా మార్చేస్తునారు . ఈ నేపథ్యంలో  ప్రజలు ఎన్నికలలో ఏం చేస్తున్నారో , ఏం చేయ్యబోతున్నారో  మనకు తెలీదు ;  కానీ , ఈ నెల అంతం లోగా తెలిసి పోతుంది .

ఈ మధ్యలో - ఎన్నికల కమిషన్ వారి తీరు కూడా కాస్త వింతగా వుంది . మోడీ గారు ఎక్కడో కమలం సింబల్ చూపారట . అది ఎక్కడా, ఏమీ అనేది విచారించ కుండా , వారిపై FIR  దాఖలు చేయించారు . మరి పోలీసులేమో - అది - వుండాల్సిన దూరాన్ని దాటే జరిగిందని చెబుతున్నారు .

మరో వైపు - కాంగ్రెస్ నేతలు ఎంతో మంది పోలింగ్ బూతు బయటికి రాగానే,  క్యూ లో నించున్న   వోటర్లకు   తమదైన  "హస్తం" గుర్తు చూపుతున్నట్టు  అందరికీ తెలుస్తోనే వుంది గా . మరి దానికేం FIR  లేదా ? తామర గుర్తు ఎక్కడో వోటర్లు కాని వాళ్లకు చూపితే ఏం తప్పు ?  ఈ గుర్తుల విషయంలో  EC వారు  కాంగ్రెస్ వారి వాదన పక్కకు పెడితే - ఎన్నో యిటువంటివి అన్ని పార్టీల వారూ చేస్తుండడం తెలుస్తుంది .

అంతెందుకు . సైకిలు గుర్తు వారు , కారున్నా కూడా , ఆ రోజు మాత్రం బూతుకు సైకిలు లో రావడం, దాన్లోనే ఊరంతా తిరగడము  జరుగుతూ వుంది . కారు గుర్తు వారూ అంతే . అది వోటర్ల మనసులలో - ఆహా , యిదీ వారి గుర్తు , అని చెప్పినట్టే కదా !

ఎలెక్షన్ కమిషన్ వారి  వోటింగ్ బూతుల్లోనూ , బయటా కూడా - "ఝాడూ" లు (పరకలు ) ఉన్నాయా లేదా ? అలాగే, బూతుల్లో - "ఫాన్లు" - అవీ వొక పార్టీ సింబల్ కదా - అవన్నీ వోటర్లకు కొన్ని పార్టీల గుర్తులు చూపుతున్నట్టే కదా. అవి చూస్తే - ఆ పార్టీలు మనకు , వోటు వేసే ముందు , గుర్తుకు వొస్తాయిగా ! ఎదురుగా వుండేది ఎందుకు  గుర్తుకు రాదు.

అసలు బూతుల్లో వుండే వస్తువులను - పార్టీల సింబల్సు గా ఎలా వొప్పుకున్నారు ? అందరూ చెయ్యెత్తి చూపే "చెయ్యి" సింబల్ - వొక పార్టీ సింబలు  గా యివ్వ వచ్చా?  యిప్పుడు వారేమో , బూతు నుండి  బయటికి రాగానే , చెయ్యెత్తి ఊపుతూ వెళ్ళిపోతున్నారు . 

యిలా ఎన్నో పార్టీ ల సింబల్సు - అందరూ - బూతుల్లోనూ , బయటా వోటర్లకే  చూపుతూ వుంటే - ఎక్కడో దూరంగా , మోడీ గారు, చిన్న తామర సింబల్ ను వోటర్లే కాని వారు ఎవరికో చూపితే - అది మాత్రమే - తప్పెలా అవుతుంది .

సరే . ఆ వోటర్లు కాని వారు టెలివిజన్ లో చూపారు అనుకోండి . అది ఎవరికని ? భారత దేశమంతా , యింకా ఎన్నో చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయా , లేదా ? అది వారికోసం కాదా . యిప్పుడు అందరూ , ప్రతిదినం ప్రచారం చేస్తున్నారు .  ప్రతి దినం ఏదో వొక చోట ఎలెక్షన్  వుంది . రెండూ జరుగుతూనే వున్నాయి కదా . మరి, ఎవరూ , మరెక్కడా మాట్లాడ కూడదా ? ఈ రోజుల్లో , దేశం లో కానీ విదేశాలలో కానీ - ఎక్కడ మాట్లాడినా , అది 10 నిమిషాల్లో ప్రతి వొక్కరికీ అందుతుంది  కదా .  అసలు అందితే తప్పేమిటి ?

ఈ చట్టాలన్నీ , యిన్ని టెక్నాలజీలు లేని సమయంలో చేసినవి , యివి, యిప్పటికి పనికి రాదు కదా .

మోడీ గారు ఎవరికో తామర సింబల్  చూపినంత మాత్రాన - అందరి మనసులూ ఆ క్షణాన  మారిపోయి ఆయనకే  వోటు వేస్తారు - అనుకోవడం ఎంత మాత్రం బాగుంది ?

కొన్ని నెలలుగా దేశమంతటా , ఎక్కడ చూసినా తామర సింబల్ వుందా లేదా ? యిన్ని నెలలుగా, మోడీ గారు అది పెట్టుకుని తిరుగుతున్నారా లేదా . తామర BJP సింబల్ అని తెలియని వోటర్లకు (నిజంగా వుంటే), ఇప్పుడాయన  ఎక్కడో, ఆ సింబల్ తీసి యిలా పట్టుకుంటే , అదీ వారెవరూ చూడక , ఎవరో, జర్నలిస్టులు మాత్రం చూస్తే - అది తప్పెలా అవుతుంది . అది అసలు ఆ జర్నలిస్టుల తప్పు మాత్రం ఎలా అవుతుంది ? వారు బూతు దగ్గరికి రాలేదు, అక్కడ అడగ లేదు . మోడీ గారు కూడా బూతు దగ్గర చెప్పలేదు చూప లేదు.

మరి యింత - సీనుందా ఈ విషయానికి ?  జర్నలిస్టులు కూడా ఆ రోజు కానీ , ఈ రోజు కానీ , ఈ మధ్య రోజుల్లో కానీ తామర ను చూపడమే లేదా . ప్రతి రోజూ , 24 గంటలూ , ప్రతి చానల్ లోనూ చూపిస్తూనే వున్నారు ; మనమూ చూస్తూ వున్నామా లేదా ? టీవీ తెరిస్తే తామర గుర్తు వుండనే వుంది కదా.

అంతే కాదు.  యింకా ఎలెక్షన్లు వున్నాయి కదా . మరి మోడీ గారు ఎక్కడో , ఎవరికో , కమలం గుర్తు చూపితే , అక్కడి బూతుల్లోని వోటర్లు మాత్రం, అది చూడకుండానే మారిపోతారంటే యెలా ? అలా మారిపోతారా ఎవరైనా ?

నా ఉద్దేశంలో - యిటువంటి రూల్సు మారాలి . నిజానికి బూతు దగ్గర కూడా వొక పెద్ద పట్టిక వుండాలి . ఎవరి సింబల్  ఏదో తెలిసేటట్టు చెప్పాలి కమిషన్ వారే . బయట వోటర్లు అది చూస్తే  -  మంచిదే . వోటింగు త్వరితంగా జరుగుతుంది . వోటర్లు తప్పుగా వేసే ప్రమాదం వుండదు . యిలా ఎన్నో వుపయోగాలున్నాయి .

అది విడిచేసి , ఎక్కడో వొక తామర చూపాడని , ఆయనపై FIR దాఖలు చేసే లాంటి రూల్సు పనికి రావు . నేను కమిషన్ ను తప్పు పట్టడం లేదు కానీ  ఇలాంటి రూల్సు మారాలి . రూలు వుందనుకోండి . కమిషన్ వారు కాంగ్రెస్ నాయకులకూ చెప్పాలి - మీరు చెయ్యి దించుకుని వెళ్ళాలి అని . యిప్పుడు వాళ్ళేమో , చెయ్యి సింబల్ , బూతు బయటే , వోటర్లకే చూపుతూ వెళతారు . మిగతా వాళ్ళు మాత్రం ఎక్కడో, వోటర్లు కాని వారికి చూపితే కూడా నేరం , యిదెలా ? సరే . BJP  వాళ్ళు కూడా రెండు చేతులూ కలిపి కమలం లాగా పట్టుకుని వెడితే పరవాలేదా .

యిదేదో - మనం, మన వోటర్లను , వారి తీసుకునే నిర్ణయాలను చిన్న చూపు చూస్తున్నట్టుగా లేదా .

ఎలెక్షన్  కమిషన్ వారు - ఎన్నికలు బాగా  జరుపుతున్నారు .

 కానీ - 1950 నాటి పద్ధతులు , యిప్పుడూ పెట్టుకుంటే , పాటిస్తే అది ఈ నాటి టెక్నాలజీకి , ఈ నాటి వోటర్లకు ,  తగినట్టుగా వుండదు .

యిది నా అభిప్రాయం . ఆ పైన ఎవరిష్టం వారిది .

జూన్ నెలలో - ఏ ప్రభుత్వం వచ్చినా - రాబోయే ఎలెక్షన్ల విషయంలో రావాల్సిన మార్పులు ఎన్నో వున్నాయని చెప్పడానికి ఈ ప్రయత్నం. 

సర్వే  జనాః సుఖినోభవంతు

= మీ

వుప్పలధడియం  విజయమోహన్







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి