18, సెప్టెంబర్ 2011, ఆదివారం

అంగుళీమాలుడు = బుద్ధుడు = సమైక్యతా వాదం = లంచగొండితనానికి ప్రతిగా పోరాటం = నరేంద్ర మోడీ


బుద్ధుడి కాలంలో  అంగుళీమాలుడు అనే గజ దొంగ వుండే వాడట. వాడు దొంగ మాత్రమే కాదు. 999  మందిని చంపి వారి వేళ్ళను హారంగా తన మెడలో వేసుకు తిరిగే వాడట.

వాడు ఎక్కడో కొండల్లో , కీకారణ్యం మధ్య - వుండే వాడు. వాడి భయంతో అటువైపు ఎవరూ వెళ్ళే వారు కాదు.
      
వొక సారి బుద్ధుడు  అటు వైపుగా వొక గ్రామానికి వెళ్ళ వలసి వచ్చింది.

శిష్యులు, అనుయాయులు అంతా భయపడ్డారు.

అందరూ - బుద్ధుడితో  అటువైపు పోనే పోవద్దని ఎంతగానో చెప్పారు.

కానీ బుద్ధుడు విన లేదు. అంగుళీమాలుడు కొండ పైన వుంటే - నా పనీ అక్కడే - అంటూ బయల్దేరాడు.

శిష్యులు వేరే మార్గం తోచక - బుద్ధుడి వెనుకే - బయల్దేరారు.

కొండ పైన - వొక చోట - దూరం నుండి  అంగుళీమాలుడు - వీరిని చూడనే చూసాడు.

మరి శిష్యులకు  అడుగు ముందుకు పడ లేదు. భయంతో - వున్న చోటనే నిలిచి పోయారు.

కానీ - బుద్ధుడు చిరునవ్వుతో - ముందుకు  సాగాడు.

అంగుళీమాలుడు - బుద్ధుడిని చూసాడు. వాడిలో - ఏదో మార్పు. ఏదో కలవరం.

వెయ్యో వాడిని చంపాలి. కానీ - 

ఇతడిని చూస్తే చాలా మంచివాడి లాగా వున్నాడు. వెయ్యో వాడిగా - యింత మంచి వాడిని - ఎలా చంపడం?

యిదీ అంగుళీమాలుడిలో  - ద్వైధీభావం.

అందుకని దూరం నుండే అరిచాడు - వెనక్కు పారిపో - లేదంటే చస్తావు.... పారిపో - లేదంటే చస్తావు.

బుద్ధుడు ముందుకు పోతూనే వున్నాడు.     అంగుళీమాలుడిని చూసి నవ్వుతూ అరిచాడు.

పారిపోతున్నది నీవే. యిక పారిపోకు. నేను వస్తున్నాను - అని.
అంగుళీమాలుడికి యిది అర్థం కాలేదు. నేను పారిపోతున్నానా? యిక పారిపోకూడదా?  ఏమంటున్నాడు ఇతను?

బుద్ధుడి మొహం లోని ప్రశాంతత - ఏదో ఆకర్షణ - అతడ్ని అక్కడే నిల బెట్టింది. జీవితంలో ఎప్పుడూ అనుభవించని అల్లకల్లోలం అతడి మనసులో.

ఏదో జరగ బోతూ  వుంది తన జీవితంలో. ఏదో  తన దగ్గర లేనిది - ఈ బుద్ధుడి దగ్గర వుంది. అది తనకూ కావాలి. అంత మాత్రం తెలుస్తూ వుంది. 

అయినా - ఏదో భయం. పారిపో. దగ్గర రాకు - అని అరుస్తున్నాడు.

బుద్ధుడూ - నువ్వు పారిపోకు. నేను వస్తున్నాను - అని దగ్గరకు వచ్చేస్తున్నాడు.

కాస్సేపట్లో - యిద్దరూ ముఖాముఖిగా - నిలబడ్డారు.

బుద్ధుడి మొహంలో ప్రశాంతత , చిరునవ్వు.  అంగుళీమాలుడి మనస్సులో - ఏదో కలవరం. ఏదో కావాలి తనకు. ఏదో తెలుస్తో వుంది తనకు.  విధి తన పని తాను చేస్తూ వుంది.

బుద్ధుడు ఏం చెప్పాడో, అంగుళీమాలుడు - ఏం విన్నాడో - శిష్యులకు తెలీదు.  తెలిసిందల్లా - అంగుళీమాలుడు బుద్ధుడి శిష్యుడు గా మారి పోయాడు.

తరువాత - బుద్ధుడు శిష్యులతో - ఏదో  రాజ్యానికి వెడతాడు. అక్కడ - శిష్యులందరూ భిక్షాటనకు వెడతారు.   అంగుళీమాలుడు కూడా.

రాజ్యంలో అందరూ చూసారు.   అంగుళీమాలుడు - అంటే - అందరికీ భయం.వణుకు.

అంగుళీమాలుడిపై - రాళ్ళు విసిరారు. అంగుళీమాలుడిలో యిప్పుడు భయం లేదు. ద్వేషం లేదు. భవతి బిక్షాం దేహి  - అంటూ , రాళ్ళ దెబ్బలు తింటూ - ముందుకు సాగాడు. 

యిప్పుడు  అంగుళీమాలుడిలో - గజ దొంగ లేదు.హంతకుడు లేదు. అది ఎప్పటి మాటో.

యిప్పుడు వున్నది - వొక మహర్షి. వొక యోగి. 

కానీ - ప్రజలకు అది తెలీదు. రాళ్ళు విసురుతూనే వున్నారు. రాళ్ళ దెబ్బలకు అంగుళీమాలుడి శరీరం వాలి పోయింది.  శిష్యులు పరుగెత్తి వెళ్లి - బుద్ధుడికి చెప్పారు. బుద్ధుడు వచ్చాడు.

అంగుళీమాలుడి శిరస్సును  - తన వొడిలో పెట్టుకున్నాడు. బాధగా వుందా - అని అడిగాడు. 

అంగుళీమాలుడు - లేదన్నాడు. నమస్కారం చేసాడు. బుద్ధుడిని చూస్తూ, బుద్ధుడి వొడిలో ప్రాణాలు వదిలాడు.

కొన్ని వేల, లక్షల యేండ్ల క్రితం వేట గాడుగా, దొంగగా వున్న - వాల్మీకి కూడా యిలాగే -  మహర్షి గా మారాడు - నారద మహర్షి మాటలతో.

రామాయణం రాసింది - దొంగగా వున్న వాల్మీకా? మహర్షి వాల్మీకా?

బుద్ధుడి వొడిలో- శిరస్సు వాల్చింది - దొంగ గా వున్న అంగుళీమాలుడా ? మహర్షి ఐన  అంగుళీమాలుడా ? 

యిదంతా ఎందుకంటే - మనుషులు మారుతారు. వారిని మారనివ్వాలి. మారే పరిస్థితులు కల్పించాలి. యిరవై ఏళ్ళ క్రితం చూసిన వాడు యింకా గజ దొంగైన  అంగుళీమాలుడు గానో, వాల్మీకి గానో - వున్నాడని అనుకోవాల్సిన పని లేదు.  వారిని మారనివ్వాలి.

మరి - ఈ రోజు మాట కొద్దాం.

ఈ రోజు - లంచ గొండులుగా వున్న వారంతా మారుతారా? మారరా? అస్సలు మారరనుకుంటే  -  ఈ నిరాహార దీక్షలు, ఈ లోక్ పాల్ లు - యివన్నీ ఎందుకు? లోక్ పాల్ వ్యవస్థనే - లంచ గొండి వ్యవస్థగా మారుతుందా?  చెప్పలేం. కానీ -

మనం మారాలి. మారి తీరాలి.  మన మానవ విలువలు మారితే - లంచగొండి తనం పోతుంది. లోక్ పాల్ వున్నా, లేకున్నా పోతుంది. మనం మారక పోతే - యిప్పటి పోలీసు వ్యవస్థ లాగా - అదీ వొక ప్రమాదంగా మారొచ్చు. అయినా - లోక్ పాల్ వ్యవస్థ కావాలి. ఎవడో వొకడు - టీ. ఎన్.  శేషన్ - లాగా వచ్చి - వ్యవస్థను ప్రక్షాళనం చెయ్యొచ్చు. అదండీ మన ఆశ.

నిజానికి - మనం - మన విద్యా వ్యవస్థలోనే - మనుషులను - మహనీయులుగా మార్చాలి. వూరికే - ఫిజిక్సు, కెమిస్ట్రీ, లెక్కలు, బయాలజీ తెలుసుకుంటే - మర మనుషులుగా మారిపోతాం.  మానవులుగా మారాలి. కొంత మందైనా - మహనీయులుగా మారాలి.  అందుకు అధ్యాపకులే కృషి చేయాలి. 

ఈ మధ్య -వొక మంచి ఆలోచన చాలా మంది చెబుతున్నారు. భారతీయ అధ్యాపక సర్వీసు - అని వొక ఉన్నత శ్రేణి సర్వీసు నెలకొల్పాలని. అది - అత్యున్నత ప్రమాణాలు, మంచి జీతాలతో సహా వుండాలని.  యిది - ఎంత త్వరగా వస్తే - దేశం అంత త్వరగా బాగు పడుతుంది. యిది వొక  గొప్ప మౌలికమైన మార్పు గా వుంటుంది. చదివే వారు అందరూ - దీన్ని గురించి తమ అభిప్రాయాలను - ప్రతి వార్తా పత్రికకు - ప్రభుత్వానికి రాస్తే - బాగుంటుంది.

సరే - వొక  కొస మెరుపు- నరేంద్ర మోడీ గారు - సద్భావానా మిషన్ - అని మూడు రోజుల నిరశన వ్రతం  చేస్తున్నారు. వారి పాలన - అద్భుతంగా వుందని - యిది వరలో - చాలా మంది అన్నారు. యిప్పుడు సాక్షాత్తూ అమెరికా కాంగ్రెసు వారే అన్నారు. వారికి నరేంద్ర  మోడీ గారు అస్సలు నచ్చరు. కానీ వారే యిప్పుడు - మోడీ గారి పాలన అద్భుతంగా వుందన్నారు.  

అయినా, 2001 -02 - ఆ మధ్యలో గుజరాత్ లో -  జరిగిన మత కలహాల్లో - రెండు వైపుల వారూ - అల్లర్లు చేసారు. అప్పట్లో - మోడీ గారు - వాటిని అణచడానికి - తగిన కృషి చేయలేదని వారిపై ఆరోపణ.  వుండొచ్చు.

కానీ - యిప్పుడు పదేళ్ళు గడిచాయి. ఈ పదేళ్ళలో - వారు అద్భుతమైన పాలన యిచ్చారు. ఈ పదేళ్ళలో - మత కలహాలు అక్కడ జరగలేదు. మరి మిగతా రాష్ట్రాలన్నింటిలో - జరిగాయి.  మన రాష్ట్రంలో కూడా జరిగాయి. మరి, వీరు, వారిని, పదేళ్ళ క్రితం నాటి మత  కలహాల గురించే గుచ్చడం -గురివింద గింజ తన క్రింద నున్న నలుపు మరిచిపోవడం లాగా వుంది.

డిల్లీ, మహారాష్ట్ర, యు.పీ, ఆంధ్ర లతో సహా - అన్ని రాష్ట్రాలలో జరిగిన, జరుగుతున్న మత కలహాలను వదిలేసి - పదేళ్ళ నాటి కలహాలను - అదీ - గుజరాత్ కలహాలను - దాన్లోనూ - వొకటిని మరిచి పోయి - మరొక్క దాన్ని గురింఛి మాత్రం    ప్రశ్నిస్తూ వుండడం - సబబుగా తోచడం లేదు.

గుజరాత్ లో - అందరినీ - సమైక్య పరుస్తున్నాను - అని అనే వారిని - ఎందుకు నిరుత్సాహ పరచాలి.

మోడీ గారి మంచి పాలనలో - యిదీ వొక భాగంగా - ఎందుకు తీసుకో రాదు. రాజకీయాలు మరెక్కడైనా వుండనీయండి. సమైక్యతా వాదం, లంచగొండితనానికి ప్రతిగా పోరాటం - లాంటి విషయాల్లో - దేశమంతా వొకటి కావాలి. 

విభజించి పాలించే రాజకీయ వాదులు చాలా ఎక్కువగా ఉన్న  మన దేశంలో - వొక్క సమైక్యతా వాది వచ్చినా మంచిదే.


వారికి - గాంధీకి పోలిక లేదు. వారికి అన్నా కు పోలిక లేదు లాంటి - వాదాలు అనవసరం. మనకు సమైక్యత కావాలి. మతవాదం, జాతివాదం వద్దు.   అవి వద్దని గుజరాత్ లో అందరూ అనడం, ముఖ్యంగా బీ.జే.పీ. వారనడం - ఈ దేశానికి చాలా మంచిదనే  నా  భావన. 

మళ్ళీ గాంధీ రాడు. మోడీ వస్తే తప్పు లేదు. మరి వారు ప్రైం మినిస్టరు కావాల్నా, వద్దా -  ఈ చర్చ అనవసరం. వొక వేళ రాహుల్ గాంధీ గారు - యింత కంటే గొప్ప పని చేస్తే  వారూ రావచ్చు. నితీష్ కుమార్ గారు గొప్ప పనులు చేస్తే - వారూ రావచ్చు. మన దేశానికి - నాలుగైదు ప్రత్యామ్నాయాలుంటే మంచిదే కదా. 

దురదృష్ట వశాత్తూ - ఈ రోజు - వొక్కరు కూడా లేదు.   మన వోటులో - "వీరెవరూ నాకు వద్దు"  అని మనం పోరాడ వలసిన  దుస్థితిలో మనం వున్నాం. అది పోయి - మనకు - గొప్ప నాయకులు వస్తారని - వీరైతే మంచిది - వారైతే యింకా మంచిది అనగలిగిన స్థితి రావాలి - అని ఆశిద్దాం.

= మీ 
వుప్పలధడియం విజయమోహన్

7 కామెంట్‌లు:

  1. its truly great pedda nanna... but.... narendra modi was an accused in a murder case in our country itself...... leave it...... we got our so called "MAHATMA GANDHI".... was the major reason for the deaths of freedom fighters with weapons..... leaving that also.... MODI JI is doing a fabulous job in our country.... no one questions about it..... lets take about ANDHRA... all the people speaking Telugu but not willing to be UNITE.... THEN how come the UNITED feeling will come in every INDIAN...... even in every BUDGET of RAILWAYS or NORMAL there is lots of difference in SOUTH and NORTH INDIA's.... there r two INDIA s existing.. in a same country INDIA.... then how come ANNA will change it r another GANDHI will change it....

    రిప్లయితొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  3. i think pedda nanna... prajalu maaranantha varaku... nayakulu maararu.... naayakulu maaranantha varaku raashtralu maaravu.... raashtralu maaranantha varaku.... deesaalu maaravu.... manchi prajalee manchi desam anukuntaaa.... pedda nanna......

    రిప్లయితొలగించండి
  4. i think we can take the " RAILWAY RESERVATION COUNTER" as best example.... " if we need tickets very important... but this counter is making it for thirty mins... but... the counter besides for our counter is making it within five mins..... but charging ten rupees extra..... which we will prefer.....???????" A MIDDLE CLASS MAN surely prefers the second counter.... so.. " THE CHANGE SHOULD BE IN EVERY INDIVIDUAL.... NO INDIVIDUAL WILL CHANGE THE COUNTRY OR THE WORLD.... " this is the practical truth .... this is just my opinion... coz... its a age not even having the age... when compared to ur experience..... i am sorry if i spoke any mistake pedda nanna.....

    రిప్లయితొలగించండి
  5. Dear Sri Harsha,

    What you say is true.I agree. 1 of your 4 comments seems to have been deleted automatically - bot not by me.

    If one Great man - is supported by a few more - they, together, become a Great Force on the society. They can bring lot of changes in the society.

    Any way - please Read - and Think on the tropics - and give Your comments

    రిప్లయితొలగించండి
  6. actually that was deleted by me itself pedda nanna..... your blogs are very inspiring and making us to think a lot.... if we r thinking we r getting the doubts what have been raised in my comments.... pedda nanna.... our room mates r also ur blog readers through my account but the comments r my own view.... pedda nanna... AAMUKTA MAALYADA is truly good but having lots of confusions ..... any how pedda nanna... if any wrong i told through my comments just make me to know and make me to correct.....

    with regards
    harsha

    రిప్లయితొలగించండి
  7. but i dont think so that i am making comments without thinking about them pedda nanna....

    రిప్లయితొలగించండి