27, ఏప్రిల్ 2011, బుధవారం

జన గణ మన = అమార్ సోనార్ బంగ్లా = పదండి ముందుకు, పదండి ముందుకు




జన గణ మన  - మన జాతీయ గీతము.

దాన్ని రాసిన కవి - నోబెల్ గృహీత -రవీంద్ర నాథ్ టాగోర్ 

యిది బెంగాలీ భాష లో రాయ బడినా - దాదాపు అన్ని భారతీయ భాషల వారికీ చాలా వరకు  అర్థమవుతుంది.

ఎందుకంటే - యిందులో - సంస్కృత పదాలు -లేదా తత్సమాలు - ఎక్కువగా వాడబడ్డాయి. 

అందరికీ తొందరగా అర్థమవుతుంది కాబట్టే - అందరికీ ప్రీతి పాత్రమయింది.

దీని ఆంగ్ల అనువాదం - టాగోర్ గారిచే - మదనపల్లె లో రాయబడింది.

చిత్రమేమంటే - భారత దేశానికి దేశీయ గీతం రాసిన టాగోర్ గారే - 

బంగ్లాదేశ్ యొక్క దేశీయ గీతం కూడా రాయడం.

బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత - టాగోర్ గారు, ఎప్పుడో రాసిన "అమార్ సోనార్ బంగ్లా" అన్న గీతాన్ని 

వారు, తమ జాతీయ గీతంగా చేసు కున్నారు.

ఆ గీతం కూడా చాలా మధురమయిన  గీతం.

మన భారత జాతీయ గీతం లో మాత్రమే - దేశాన్ని గురించిన యిన్ని వివరణలు  చూడగలమని నా 

విశ్వాసం. 

మరే దేశీయ గీతం లోనూ ఇన్ని ప్రాంతాలను గురించి గానీ, పర్వతాలగురించి గానీ, నదుల గురించి గానీ,

సముద్రాన్ని   గురించి గానీ - మనకు కనిపించదు.

మొదట మన మన భాగ్య విధాతను ప్రస్తావించిన ఈ గీతంలో  - చివర  అందమైన "జయ,జయ" కారాలతో,

ముగింపు ఎంత బాగుంది!

యిది మొట్ట మొదట - కోలకాతా లో 1911 , డిసెంబరు, 27 వ తేదీ నాడు యిండియన్ నేషనల్ కాంగ్రెసు

వారి సభ లో  పాడబడింది.  

తరువాత, మన జాతీయ గీతంగా ఎన్నుకో బడింది.

ప్రతి దేశానికీ - వారి దేశీయ గీతం పై మక్కువ వుండటం సహజమే అయినా -

మన గీతం గొప్పతనం, మాధుర్యం  చాల, చాల ఎక్కువని - నాకనిపిస్తుంది. 

అప్పుడప్పుడూ అనిపిస్తుంది -

మళ్ళీ వొక టాగోర్, వొక వివేకానందుడు , వొక రామ కృష్ణుడు వొక బోసు బాబు -అదే బెంగాల్ నుండి ఎందుకు 

రావడం లేదని. 

ఏ సంస్కృతి గొప్ప ధనమయినా  - ఆ సంస్కృతిలో పుట్టే - కొద్ది  మంది  గొప్ప మహనీయుల -వర ప్రసాదం గానే వుంటోంది. 

ఈ సారి - అటువంటి - మహనీయులు అంధ్ర దేశములో పుట్టాలని, పుడతారని నా  కోరిక, ఆకాంక్ష..

మనుషుల్ని, మనసుల్ని కలిపే వాళ్ళు , ప్రగతి పథంలో నడిపించే వాళ్ళు మళ్ళీ  రావాలి.

వచ్చి, ప్రతి రంగంలోనూ మనల్ని, ముందుకు తీసుకు వెళ్ళాలి.

పదండి ముందుకు, పదండి ముందుకు, 

పదండి పోదాం పై పైకి.


= మీ

వుప్పలధడియం విజయమోహన్ 

అన్ని రహదారులూ ప్రశాంతి నిలయం వైపే.= సత్య సాయి బాబా వైపే - భాష్పాంజలులతో



అన్ని రహదారులూ రోము నగరానికే వెళ్ళుతాయి.

యిది ఆ దేశపు సామెత. ఆ కాలపు సామెత.


ఈ రెండు, మూడు  రోజులుగా -

మన దేశం లో  -

అన్ని రహదారులూ ప్రశాంతి నిలయం వైపే. 

కోట్ల ప్రజానీకం మనసులంతా  - సత్య సాయి బాబా వైపే.

వొక మహనీయుడు  మరి లేదంటే - గుండె లోతుల్లో - ఎక్కడో-
ప్రతి వొక్కరికీ , వొక వెలితి  తెలియడం అతి సహజంగా కలుగుతుంది.
కంట తడి పెట్టడం తమకు తెలియకుండానే జరుగుతుంది.

రాజకీయ నాయకులను వొక పక్క పెట్టండి.

వొక గవాస్కరు, వొక  టెన్డుల్కరు - కంట తడి పెట్టడం మీరు ముందు చూశారా. 

వారు వోడినప్పుడు కూడా  లేదు.

మరి ఈ రోజు!!

వారూ, మీరూ కంట తడి పెట్టారు కదా. 

వచ్చిన లక్షలాది మంది కంట తడి మనం మరి చూడ గలమా.

వారి గుండె ఆరాటాన్ని మరి విన గలమా!

ఆ కంట తడే సత్య సాయికి మన మౌన, శ్రద్దాంజలి.  


అందరి భాష్పాంజ లులతో - 

ఆ మహనీయుడికి 

మన నివాళులర్పిద్దాం 


= మీ

వుప్పలధడియం విజయమోహన్ 

25, ఏప్రిల్ 2011, సోమవారం

కాకినాడ = గిన్నెస్స్ రికార్డు ప్రయత్నం =వొక గంట లో =- 12 లక్షల చెట్లు నాటాలని = శుభం

కాకినాడలో గిన్నెస్స్ రికార్డు నెలకొల్పాలని ప్రయత్నం జరుగుతోంది.

జూలై తొమ్మిదవ తేదీ నాడు - వొక గంట లో - 12 లక్షల చెట్లు నాటాలని - ఉద్దేశం. 

గిన్నెస్స్ రికార్డు వొక ప్రక్కన పెడితే  - వొక్క కాకినాడ చుట్టూ -  12 లక్షల చెట్లు నాటడము,   కాకినాడకూ, పరిసరాలకూ ,మొత్తం పర్యావరనానికీ    ఎంతో మేలు కలిగించే విషయం.

కాకినాడ జవహర్ లాల్ టెక్నలాజికాల్   యూనివర్సిటీ వారు ఆ ప్రయత్నానికి దోహదముగా  వొక మోటారు సైకిలు ర్యాలీ నిర్వహించారట.

రిలయన్సు సంస్థ అధికారులు ప్రముఖ పాత్ర వహిస్తున్నారట.

కాకినాడప్రజలారా!  తరలి రండి. ఈ ఆదర్శ వంతమైన ప్రయత్నాన్ని జయప్రదం చేయండి.

వొక్క రోజు, ఒక గంట లో కాకినాడ మారిపోగలదు. రండి మరి.

తరువాత - ఆ తరువులు పెరగడానికి కాస్త శ్రద్ధ తీసుకుంటే - మీ వూరు నందన వనం కాగలదు.

మీకు - మా శుభాభినందనలు.

విజయవాడ వారు వింటున్నారా.

చిత్తూరు వారు వింటున్నారా.

కర్నూలు వారు, మెదక్ వారు, వరంగ ల్ వారు,  నెల్లూరు వారు - మరి ఆంధ్రులందరూ   వింటున్నారా.

ప్రముఖులు విన్నారా. అధికారులు విన్నారా. నటులు, గాయకులూ విన్నారా.

అయ్యా! కాకినాడ వారికి దక్క బోతున్న ఆ  గౌరవం  - మీకూ రావాలి.

గౌరవం మాత్రమే కాదు. మన రాష్ట్రమంతా సస్యశ్యామలం గా ,కనులకు కమనీయం గా, అందముగా , హుందా గా,
ఆరోగ్యము గా  కనిపించాలి.


యిది ఆరంభం. అంతం లేని ఆరంభం.

శుభారంభం.

జరిగే మంచి పనులకు పూర్తి చేయూత నిద్దాం

= మీ

వుప్పలధడియం విజయమోహన్
 . 

24, ఏప్రిల్ 2011, ఆదివారం

సత్య సాయి బాబా - దివంగతులైనారు - కానీ - ప్రశాంతి నిలయము గా ఉన్న మనస్సులో - వారు - ఎప్పటి లాగే , ఎప్పుడూ వుంటారు

సత్య సాయి బాబా 85 ఏళ్ళ వయసులో - 

దివంగతులైనారు.

వారు అప్పుడున్నదీ అనంతపురమే. 

వారు, యిప్పుడున్నదీ "అనంత" పురమే.

వారి నివాసము అప్పుడూ ప్రశాంతి నిలయమే. 

యిప్పుడూ - ప్రశాంతి నిలయమే.


వారు చేసిన -ప్రజోపయోగ కార్యాలు - అన్నీ, యిన్నీ కావు.

వారు చెప్పిన మంచి మాటలు అన్నీ, యిన్నీ  కావు.

వారు  భక్తుల మనసులలో - 

మొలకెత్తించిన  భక్తి భావనలు అన్నీ యిన్నీ కావు.

"సంభవామి యుగే, యుగే" - అన్నట్టు మళ్ళీ వారొస్తారు.

భక్తుల కోసం - అందరి కోసం -  మళ్ళీ వారొస్తారు.

అంత వరకు - భక్తుల మనస్సులో - ఎప్పటి లాగే వుంటారు.

మనస్సు - ప్రశాంతి నిలయము గా ఉన్నంత వరకు - వారందులో - ఎప్పుడూ వుంటారు .

వారి లాగా ప్రశాంత మైన ముఖాలతో,  వారి లాగా చిరునవ్వుతో - వున్న   వారందరిలో - వారు - ఎప్పుడూ వుంటారు 

= నమస్సుమామ్జలులతో

వుప్పలధడియం విజయమోహన్  
 

Anna Hazare= అన్నా హజారే = లోక్ పాల్ బిల్లు డ్రాఫ్టింగు కమిటీ = సభ్యులపై దుమ్ము / బురద చల్లేవారిని ఆపాలి = ఎలా ఆపాలి?


శ్రీకృష్ణ దేవ రాయల వారి కాలం లో - 
ఒక సారి - 
పెద్ద గిన్నె  లోకి  ప్రజలనంతా పాలు పోయ్యమంటే -
వొకరికి తెలియకుండా వొకరు - యిలా ప్రతి వొక్కరు -
గిన్నె లోకి - నీళ్ళు మాత్రమే పోసారట.


ఆంగ్లము  లో  కరప్షన్ అన్న పదానికి కల్మషము అని ముఖ్యమైన  అర్థము చెప్పు కో వచ్చు.

పాలు పొయ్య వలసిన చోట నీళ్ళు పొయ్యడము - మనస్సులో వున్న కరప్షనా కాదా? 

కానీ - అది ఆ కాలము.నీళ్ళు పోసారు. వొట్టి చెంబు పొయ్య లేదు.  బురద పొయ్య లేదు. విషం కలప లేదు.

అయినా  - ఈ కల్మషము చాల (లేదా  కొద్ది ) మంది మనుషుల్లో - కొద్ది, కొద్ది గా అప్పటినుండే వుందని మనకు తెలుస్తూ వుంది. 

ఈ కాలములో - ఈ కల్మషము - లంచగొండి తనము గా మారి - మూడు పువ్వులు, ఆరు కాయలుగా దిన దిన ప్రవర్ధమానమవుతున్న సంగతి  మన కందరికీ తెలుసు.

వందల నుండి, వేలు, వేల నుండి లక్షలు, లక్షల నుండి కోట్లు, కోట్ల నుండి వేల కోట్లు, మరి యిప్పుడు లక్షల కోట్లకు - ఈ లంచగొండి తనము ఎదుగుతున్న విషయము - మన కందరికీ తెలుసు.

లంచము తీసుకునే వారికి సిగ్గు, భయమూ రెండూ లేకుండా పోతున్న దన్న సంగతి కూడా మనకు తెలుస్తూ  వుంది.

ఈ ముళ్ళ చెట్టు పెరుగుదలను ఆపాలి - ఆపక పోతే ప్రమాదము చాలా, చాలా ధగ్గరికొచ్చేసిన్దన్న - మాట కూడా మనకందరికీ తెలుస్తూనే వుంది.

అన్నా హజారే గారి ఉద్యమము అందుకే.

ఈ సమయములో అన్నా హజారే గారి ఉద్యమానికి - చేయూత నివ్వ కుండా - 

సభ్యులందరిపైన- దుమ్ము , బురద చల్లడము - పాలు పొయ్య వలసిన చోట నీళ్ళు పొయ్యడము కాదా?

పోసే వారి ఉద్దేశము  ఏమిటి?

భారత దేశములో- కరప్షన్ మూడు పువ్వులూ, ఆరు కాయలు గా వుండాలనేనా?

ఆ చట్టము 42 ఏళ్ళు గా, మన పార్లమెంటు లో మగ్గుతూ వుంది. బయట లంచగొండి తనము పెరుగుతూ వుంది.

అయినా - ఆ కమిటీ వారిపై - అదీ యిప్పుడే - ఎప్పటి విషయానో లేవ దీసి బురదల్లే వారి అసలు ఉద్దేశము - తేట తెల్లమే గదా!  

మరి - వీరినెలా ఆపడము?

వొక్కటి.

గౌరవనీయులైన  మన ప్రధాన మం త్రి గారు -  ఈ సభ్యులందరికీ  కాబినెట్ మంత్రి ప్రతి పత్తి ని, హోదాని కలిగించి,  ఈ  సమయంలో, వారికి, మంత్రులకున్న - ఇమ్మ్యునిటీ  కలిగించాలి. వారిపై - చిల్లర కేసులు పెట్ట  గలిగే  పరిస్థితి తీసేయ్యాలి. 

అంతే కాదు. రెండవది ఏమిటంటే -

ఈ బురద చాల్లే వారు ఎప్పుడు ఆపుతారు? 

వారిపై కూడా - దేశము లోని ప్రతి వొక్కరు బురద చల్లాలి. అప్పుడే ఆపుతారు.

ఈ చట్టం వచ్చే వరకూ - సభ్యుల పై ఏ వొక్కరూ బురద చల్ల కుండా ఆపాల్సిన బాధ్యత అందరిపైనా వుంది.

తిట్ట వలసిన వాడిని, తిట్ట వలసిన సమయము లో  తిట్టక పోతే - కొట్టడానికి వస్తాడు. 

అర్జునా, గాండీవం ధరించు. అమ్ములను సంధించు. 

మిగతా పని నేనే చేసేస్తాను .  నువ్వు నిమిత్త మాత్రుడివే. అన్నాడు శ్రీకృష్ణుడు.

శ్రీకృష్ణుడు యిప్పుడూ ఎక్కడో, సిద్ధం గానే వుంటాడు. ప్రతి అర్జునుడూ తన  గాండీవాన్ని  ధరించాలి  మరి.

అహింసా పోరాటమయినా - అహింస గానే అయినా   -   పోరాటము జరగాలి కదా?


లంచగొండి తనము పైన పోరాడే వాళ్ళను కాపాడక పోతే -

లంచగొండి తనము పై పోరాటము వుండదు.

యిందులో - మీ వంతు మీరు చేస్తున్నారా? ....  చేస్తున్నారా? ... చేయండి సార్.

 అదండీకథ .

= మీ

వుప్పలధడియం   విజయమోహన్   

22, ఏప్రిల్ 2011, శుక్రవారం

భూమి దినం - Earth day 2011 = 22nd, ఏప్రిల్, 2011 = (Telugu) : భూమి కేమీ ప్రమాదము లేదు= ప్రమాదం మనిషికే= Munchukosthonna Paramaadham Manake = yemi cheyyaali?

22 , ఏప్రిల్ నెల, 2011
 =రెండు రకాలుగా ప్రాముఖ్యం కలిగింది.
జీసస్ క్రీస్తు   గారు శిలువ వేయబడిన రోజు - 

వారిని - ప్రపంచమంతటా తలుచుకొనే రోజు.

జీసస్ క్రీస్తుచెప్పిన మంచి మాటలు మరో సారి మననం చేసుకునే రోజు.

రెండవది - 22 , ఏప్రిల్ ఎర్త్ దినము గా (భూమి దినం - అందాము) ప్రపంచమంతటా పిలువ బడుతూ వుంది.

భూమికి రక రకాలయిన ప్రమాదాలు ముంచుకొస్తున్నట్టు - వాటినుండి, భూమిని మనం కాపాడవలసిన బాధ్యత మనపై వున్నట్టు, మనం అనుకుంటున్నాము.

అందుకే ఈ భూమి దినాన్ని గురించి అనుకుంటున్నాము.

నిజానికి - భూమి కేమీ ప్రమాదము లేదు. నమ్మండి.

భూమి - సూర్యుని చుట్టూ , తన చుట్టూ తిరుగుతున్నంత కాలం; తన భాద్యత తను చేస్తున్నంత కాలం, భూమి కేమీ ప్రమాదం లేదు.

ప్రమాదం మనిషికే. 

బుద్ధి వున్నా ఉపయోగించకుండా వున్న చెట్ల నన్నిటినీ నరికేయడము,   కొత్త చెట్లు నాటక పోవడము లాంటి పనులు చేస్తూ, తన పై, తానే, మన్ను పోసుకుంటున్న మనిషికే ప్రమాదం ముంచుకొస్తున్నది.

మనం విడిచే గాలిని చెట్లు పీల్చుకుంటాయి. దాన్ని, మళ్ళీ , మనకోసం, ఆక్సిజన్ తో నింపి, మనకందిస్తుంది. అంటే

-  మన వొక ఊపిరి తిత్తి ఆ చెట్టన్న మాట. నిజానికి, సగం ఊపిరి తిత్తే మనలో వుంది.

అంతేనా. చెట్లు మనకు, ఆహారాన్నిస్తుంది. మనకోసం వర్షాన్ని తెప్పిస్తుంది.

వర్షాన్నిస్తుంది. నీళ్ళు తెప్పిస్తుంది.

యింతెందుకు. చెట్లు లేకుండా - మనిషి లేడు. 

మనిషి లేకున్నా - చెట్ల కేమీ ప్రమాదం లేదు.

మన వొక ఊపిరి తిత్తి, మన వొక (అర్ధ  భాగం) గుండె, మన మెదడులో అర్ధ భాగం - ఆ చెట్టు - అన్న విషయం మనకు అర్థమవుతున్నదా.

అర్థమయితే చెట్లు వివక్షత లేకుండా నరికేస్తామా?


మీ వొక ఊపిరి తిత్తి, వొక (అర్ధ  భాగం)  గుండె, మెదడులో అర్ధ భాగం - మీరే నరికేస్తారా?

2012 వ సంవత్సరం, భూమి దినం వచ్చే లోగా, వొక పది చెట్లైనా, మనం ప్రతి వొక్కరూ -  నాటుదామా!

మన కోసం - 

భూమాత సంతృప్తి పడితే - మనం బాగుంటాము.

లేదంటే - భూమి బాగానే వుంటుంది - మనమే భాగుండము.

అదండీ విషయము.

= మీ
వుప్పలధడియం విజయమోహన్
 


21, ఏప్రిల్ 2011, గురువారం

FIGHTING CORRUPTION = DR.JAYA PRAKASH NARAYAN = ANNA HAZARE = RAM DEV JI = MODI = UNITY OF THE ORDINARY PEOPLE = (TELUGU BLOG)

లంచ గొండి తనం పూర్తిగా పోవాలి - అని మన ఉద్యమం.

మనదంటే -  మన అన్నా హజారే గారి దన్న మాట.

ఆయనకు డెబ్భై ఏళ్ళు పైబడింది. ఎన్ని రోజులైనా  అన్నము తినకుండా వుండగలరు.

గాంధేయ  వాదులంతా  అంతే.

ఆయనకు గుజరాతు ముఖ్య మంత్రి మోడీ గారి పాలన నచ్చింది. 


కానీ, ఆయన చుట్టూ వున్నా వారిలో మోడీ గారు కొంత మందికి నచ్చ లేదు.

కాబట్టి - మోడీ గారు ఏమి చేసినా - ఏమి చేసినా సరే - వీరికి నచ్చదు.

గుజరాతు ప్రజలంద రికీ  నచ్చినా - వీరికి నచ్చదు.

అయితే - అన్నా గారికి నచ్చినా - నచ్చినట్టు - చెప్పకూడదు.

సరే =  వీరికి, నక్సలై ట్లు  ఎందుకనో నచ్చారు. మోడీ గారు నచ్చ లేదు.

అన్నా గారికి మోడీ గారు నచ్చారు. నక్సలై ట్లు నచ్చారో, లేదో మనకు తెలీదు.

ఎవరికి, ఎవరైనా , ఏదైనా  నచ్చొచ్చు. పక్కనున్న వాళ్లకు కూడా వారే నచ్చాలి, అవే నచ్చాలి - అంటే ఎలా?

అదే - నక్సలైట్ల వాదం. వారికి నచ్చింది - మనకూ నచ్చాల్సిందే. అంతే మరి.

మన చాలా మంది రాజకీయ నాయకుల మనసులోని, వారి వాదము కూడా ఇదే.

వీరూ, వారూ - పెద్ద తేడా లేదు - డబ్బు విషయం తప్పితే.

మన జయప్రకాశ్ నారాయణ గారు కూడా - దాదాపు వొంటరిగా - లంచ గొండి తనం ను - ఎదిరించి పోరాడుతున్నారు.  వారు మనకు (నాకు) నచ్చారు. మంచి వాడని, మన లాంటి వాడని. 

అయితే - మంచి వాళ్ళ వెనుక పోవాలంటే - మనలో, చాలా మందికి భయంగానే వుంటుంది.

మంచి తనమంటే మాటలా?
మీకు రేషన్ కార్డు కూడా రాధు. ఆసుపత్రి లో  మందులివ్వరు. పాసు పోర్ట్ రాధు. 

స్కూలు లో మీ వాడికి అడ్మిషన్ దొరకదు.

మీరు సగటు మనిషి.

సగటు మనిషులు  లంచ గొండి కాదు;  నక్సలై ట్లు కాదు. రాజకీయ నాయకులు కానే కాదు.

సాధారణంగా బ్రతికేస్తే చాలనుకునే వాడు.

సగటు మనిషికి ధైర్యాన్నివ్వ గల విద్య, నాయకులు, పరిస్థితులూ  మనకు కావాలి.

అందుకు తత్క్షణ మందు వొక్కటే! సగటు మనుషులందరూ - వొకటి కావాలి.

వారానికి వొక సారి - ఎక్కడైనా కలిసి, కాస్సేపు మాట్లాడుకోండి. 
అంతా కలిసి - వొక చిన్న మీటింగు పెట్టండి - మేమంతా (మనమంతా) వొక్కటే - అనండి  - చూదాము.

వెయ్యి మంది వొక ఆఫీసరు ముందు నిలవండి - ఆయన లంచము అడుగుతారేమో చూద్దాం.

రామ్దేవ్జీ  గారు చెప్పేదీ అదే. అన్నా హజారే గారు చెప్పేదీ అదే. గాంధీ గారు ఎప్పుడో చెప్పిందీ అదే.

సగటు మనుషులు కలిస్తే - పెద్ద మనుషులవుతారు.

అదండీ కథ,

= మీ వుప్పలధడియం  విజయమోహన్