sathya sai baba లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
sathya sai baba లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, ఏప్రిల్ 2011, బుధవారం

అన్ని రహదారులూ ప్రశాంతి నిలయం వైపే.= సత్య సాయి బాబా వైపే - భాష్పాంజలులతో



అన్ని రహదారులూ రోము నగరానికే వెళ్ళుతాయి.

యిది ఆ దేశపు సామెత. ఆ కాలపు సామెత.


ఈ రెండు, మూడు  రోజులుగా -

మన దేశం లో  -

అన్ని రహదారులూ ప్రశాంతి నిలయం వైపే. 

కోట్ల ప్రజానీకం మనసులంతా  - సత్య సాయి బాబా వైపే.

వొక మహనీయుడు  మరి లేదంటే - గుండె లోతుల్లో - ఎక్కడో-
ప్రతి వొక్కరికీ , వొక వెలితి  తెలియడం అతి సహజంగా కలుగుతుంది.
కంట తడి పెట్టడం తమకు తెలియకుండానే జరుగుతుంది.

రాజకీయ నాయకులను వొక పక్క పెట్టండి.

వొక గవాస్కరు, వొక  టెన్డుల్కరు - కంట తడి పెట్టడం మీరు ముందు చూశారా. 

వారు వోడినప్పుడు కూడా  లేదు.

మరి ఈ రోజు!!

వారూ, మీరూ కంట తడి పెట్టారు కదా. 

వచ్చిన లక్షలాది మంది కంట తడి మనం మరి చూడ గలమా.

వారి గుండె ఆరాటాన్ని మరి విన గలమా!

ఆ కంట తడే సత్య సాయికి మన మౌన, శ్రద్దాంజలి.  


అందరి భాష్పాంజ లులతో - 

ఆ మహనీయుడికి 

మన నివాళులర్పిద్దాం 


= మీ

వుప్పలధడియం విజయమోహన్ 

24, ఏప్రిల్ 2011, ఆదివారం

సత్య సాయి బాబా - దివంగతులైనారు - కానీ - ప్రశాంతి నిలయము గా ఉన్న మనస్సులో - వారు - ఎప్పటి లాగే , ఎప్పుడూ వుంటారు

సత్య సాయి బాబా 85 ఏళ్ళ వయసులో - 

దివంగతులైనారు.

వారు అప్పుడున్నదీ అనంతపురమే. 

వారు, యిప్పుడున్నదీ "అనంత" పురమే.

వారి నివాసము అప్పుడూ ప్రశాంతి నిలయమే. 

యిప్పుడూ - ప్రశాంతి నిలయమే.


వారు చేసిన -ప్రజోపయోగ కార్యాలు - అన్నీ, యిన్నీ కావు.

వారు చెప్పిన మంచి మాటలు అన్నీ, యిన్నీ  కావు.

వారు  భక్తుల మనసులలో - 

మొలకెత్తించిన  భక్తి భావనలు అన్నీ యిన్నీ కావు.

"సంభవామి యుగే, యుగే" - అన్నట్టు మళ్ళీ వారొస్తారు.

భక్తుల కోసం - అందరి కోసం -  మళ్ళీ వారొస్తారు.

అంత వరకు - భక్తుల మనస్సులో - ఎప్పటి లాగే వుంటారు.

మనస్సు - ప్రశాంతి నిలయము గా ఉన్నంత వరకు - వారందులో - ఎప్పుడూ వుంటారు .

వారి లాగా ప్రశాంత మైన ముఖాలతో,  వారి లాగా చిరునవ్వుతో - వున్న   వారందరిలో - వారు - ఎప్పుడూ వుంటారు 

= నమస్సుమామ్జలులతో

వుప్పలధడియం విజయమోహన్