పంచ మహా యజ్ఞాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పంచ మహా యజ్ఞాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, మే 2011, గురువారం

పంచ మహా యజ్ఞాలు చివరి మాట = అమృతం మీ చేతిలో వుంది! = మీరు దేవతలా? రాక్షసులా?

పంచ మహా యజ్ఞాలు 
చివరి మాట 

యింత వరకు మనం చూసిన ఐదు యజ్ఞాలు - దేవ, ఋషి, పితృ, మనుష్య, భూత యజ్ఞాలు. 

అంటే - ప్రపంచం లోని - దాదాపు ప్రతి ప్రాణి పట్ల - మీ కర్తవ్యం ఏమిటో చూసాము.
ఈ ప్రపంచం లోని అన్ని ప్రాణులూ - వొకటి  పై మరొకటి  ఆధార పడి ఉన్నదన్న  సత్యాన్ని - ఈ యజ్ఞాలు గుర్తు చేస్తాయి. 

మీరు ప్రార్థిస్తే - దేవతలు సంతోష పడితే - దాని అర్థం ఏమిటి? దేవతల సంతోషం కూడా - కొం త వరకు, మీ ప్రార్థనలపైన ఆధార పడి వుందనా? 

ఆధార పడక పోయినా - వారు సంతోష పడతారన్న మాట నిజమే.

ప్రకృతి శక్తులు (దేవతలు) ప్రపంచంలోని - ప్రతి ప్రాణినీ - సమానం గానే చూస్తారు.
 
వొక్క మానవుడి విషయం లోనే - ప్రకృతి శక్తులు - కొంత భిన్నంగా నడుచు కుంటాయి 
.
 ప్రార్థన చేయ గల, అర్థించ గల, ప్రకృతి శక్తుల పనికి తోడు పడ గల , లేదా, వాటి పనికి, కొంత అడ్డు పడ గల - శక్తి  వొక్క మనిషికే వుంది. 

మనిషి వొక్కడే - ప్రకృతి శక్తుల శక్తి ని అధిగమించి  - తన లోని పరమ తత్వాన్ని, దైవత్వాన్ని, సిద్ధింప చేసుగోగల  సమర్థుడు.  ఆ ప్రయత్నంలో, వొక భాగమే, పంచ మహా యజ్ఞాలు. 

ఏనుగు కానీ, సిం హము కాని - వొకరికొకరు సహాయం చేసుకోవాలని - ఎప్పుడూ అనుకోలేవు. పాము, కప్ప సఖ్యంగా వుండటం - మనం చూడలేం.వొక్క కార్టూన్ ఫిల్ములో తప్ప.

మనిషికి మాత్రమే - ప్రతి ప్రాణి తోనూ సఖ్యంగా వుండటం సాధ్యం.
అలాగే - మనిషితో మాత్రమే - సఖ్యంగా వుండటం, ప్రతి ప్రాణికీ సాధ్యం. లేదంటే - వాటి గుణం - స్వజాతితో సఖ్యం విజాతితో విరోధం. స్వజాతిలో కూడా - కేవలం, స్వప్రయోజనాలకోసమే సఖ్యం. లేదంటే - విరోధం సహజం.

అంటే  -  మనిషికి మాత్రమే - ప్రతి ప్రాణి తోనూ సఖ్యంగా వుండటం సాధ్యం. అంటే - మనిషిలో మాత్రమే  - దైవత్వపు చాయలు  పూర్తిగా వున్నాయి. ప్రతి ప్రాణిలోనూ, తనను తాను చూసుకోగలడు. తనలో, ప్రతి ప్రాణినీ చూడ గలడు.
ప్రతి ప్రాణినీ, తన ప్రేమతో, దయతో - కట్టి పడేయగలడు. అంతకు మించి క్రూరత్వం వుంటే - సంహరించనూ గలడు.  ఇదీ దైవత్వమే.   

మనిషి తనలోని దైవత్వంతో , మనం చూసిన పంచ మహా యజ్ఞాల ద్వారా,  ప్రకృతికి ఎంతో తోడుపడ గలడు. ఆ ప్రయత్నంలో - తన జీవితాన్ని కూడా, ఆనందమయం చేసుకో గలడు.

కాని - స్వార్థం తలెత్తితే  - మనకు, ప్రకృతి శక్తులూ, ఎదురు నిలుస్తాయి. దైవం కూడా ఎదురు నిలుస్తుంది. 

అప్పుడు - సాధారణ మృగాల లాగా - ప్రకృతి శక్తి ముందు, మనం సమసి పోతాం.
సరే. పంచ మహా యజ్ఞాలలో - మనం చూడని వొకే వొక ప్రాణి - "మనమే".  అంటే - మీరే.

నిజమా? కాదు. సర్వే జనాః  సుఖినో భవంతు - అంటే, ఆ అందరిలో, మీరు వున్నారా, లేదా? ఉన్నారుగా!

మనం, ముఖ్యంగా; చాలా, చాలా, ముఖ్యంగా - గుర్తు పెట్టుకోవలసిన గొప్ప నిజం వొకటుంది.
మీరు - మీకోసం, మీ స్వార్థం కోసం  చేసే ప్రయత్నాలలో - మీకు వచ్చే సుఖం, ఆనంధం చాలా తక్కువ. సాధారణ జంతువులకొచ్చే ఆనందమే మీకూ వస్తుంది. అంతే.

కానీ- మనం చెప్పుకున్న - పం చ మహా యజ్ఞాలలో, మీ కొచ్చే ఆనందం, అలౌకికం, దైవీకం, వెల కట్ట లేనిది.

అందుకే  - నిస్స్వార్థ సేవ చేసే వారి ముఖంలో - ఎప్పుడూ, (ఎంతో) ఆనంధం, చిరునవ్వు  వుంటుంది.

స్వార్థపరుల ముఖాలలో, మనస్సులో - ఆనందం చాలా తక్కువ, అశాంతి చాల ఎక్కువ. ఎందుకంటే - స్వార్థం మృగ లక్షణం గనుక . 

మీరే  చూడండి . మీకే తెలుస్తుంది.

చిన్న కథ -

దేవతలకూ, రాక్షసులకూ,  చేతులు వంగకుండా గట్టిగా కట్టివేసాడట దేవుడు.  తరువాత, వారి  వొక్కొక్కరి దోసిలిలో , అమృతం పోసి - తాగమన్నాట.

రాక్షసులు - కట్టిన చేతులు వంచలేక, అమృతం తాగడానికి, నానా అవస్థలూ పడి, చేతుల్లోని అమృతం క్రింద పారబోసుకున్నారట.

దేవతలు - కట్టిన చేతులలోని అమృతాన్ని,తమకు ఉపయోగ పడక పోయినా - ఎదుటివారికి, తమ దోసిలితో , త్రాగిం చారట. అలా, దేవతలందరికీ, ఎవరో, వొకరు త్రాగిపించారట. 

నిస్స్వార్థంతో, ప్రేమతో,  అమరత్వాన్ని సాదించ వచ్చునని వారు తెలుసుకున్నారు.

మనమైనా అంతే. మనకైనా అంతే.  

మీ చేతులు మీకు  కనిపించని త్రాళ్ళతో కట్ట బడి వున్నాయి. మీ చేతులలో, ప్రేమ అనే అమృతం వుంది. అది మీరు త్రాగలేరు. కాని, పది మందికి త్రాగించ గలరు. 

మీరది చేయాలే గాని - వందలాది, వేలాది, లక్షలాది చేతులు - ప్రేమనే, ఆనందమనే, అమృతంలో - మిమ్మల్ని ముంచెత్తుతాయి. 

యిక - ఆలస్యం వద్దు. ...రండి. ...పదండి ముందుకు; 

- మీ

వుప్పలధడియం విజయమోహన్ .

2, మే 2011, సోమవారం

పంచ మహా యజ్ఞాలంటే ఏమిటి? అవి - ఎవరు, ఎప్పుడు, ఎందుకు చేయాలి?


పంచ మహా యజ్ఞాలంటే ఏమిటి?

    అవి - ఎవరు, ఎప్పుడు, ఎందుకు   చేయాలి?


భారతీయ సాంప్రదాయం లో - పం చ మహా యజ్ఞాలకు చాలా, చాలా ప్రాముఖ్యం వుంది. స్వార్థ రహితంగా చేసే, ఏ పని అయినా - యజ్నమనే చెప్ప బడుతుంది. ఈ స్వార్థ రహిత కార్యాలను - మన వాళ్ళు 5 రకాలుగా  విభజించారు.

మనిషిగా పుట్టిన ప్రతి వొక్కరు -  యివి చెయ్యాలి.

ఎప్పుడు ? ప్రతి రోజూ.

ఎందుకు - అనేది తరువాత వొస్తుంది.

పంచ మహా యజ్ఞాలు యివి - (1 )  దేవ యజ్ఞము (2 ) రుషి యజ్ఞము (3 ) పితృ యజ్ఞము (4 ) మనుష్య యజ్ఞము (5 ) భూత యజ్ఞము.

వీటిని గురించి - క్లుప్తం గా రెండు, మూడు వ్యాసాల్లో  చెబుతాను. 


 దేవ యజ్ఞము 

సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, వరుణుడు, భూమి, ఆకాశము, జలము, -లాంటి    ప్రకృతి శక్తులను - మనం దేవతలుగా చెప్పుకుంటాం. ప్రతి రోజూ - వారి నుండి  , వారి శక్తిని కొంత అడుగుతాం; వారు యిస్తారు.  ఆ శక్తితో మన పనులు మనం చేసుకుంటాం. ఆ శక్తీ అయిపోతుంది. మళ్ళీ అడుగుతాం. మళ్ళీ యిస్తారు. జీవితం యిలా జరిగిపోతూ వుంటుంది. ప్రతి నిముషం వారి పైన - మనం ఆధార పడి ఉన్నాము. 

రెండు నిమిషాలు, ముక్కు మూసుకుని కూర్చోండి. మీకు గాలి ఎంత అవసరమో - తెలిసి పొతుంది. 

వొక్క రోజు - నీళ్ళు తాగకుండా వుండండి. మీకు నీళ్ళ అవసరం తెలిసి పోతుంది. 

రెండు రోజులు - భోం చెయ్య కుండా వుండండి. మీకు, భూమి అవసరం ఎంతో తెలిసిపోతుంది. 

సూర్యుడి అవసరం, చంద్రుడి అవసరం, - అందరి  దేవతల  అవసరం మనకు తెలిసి పోతుంది. 

అయితే - ఆధునిక యుగంలో - మనకు తెలియనిది, ఆ దేవతలందరూ, మన మాట , మన ప్రార్థన వింటారని.  

ఆ దైవీక శక్తులకూ -  మన ప్రార్థనంటే  యిష్టమని.

మనం దేవ యజ్ఞం ప్రతి రోజూ చెయ్యాలి. దేవతలకు యివ్వవలసింది వారికి యివ్వాలి. చెయ్య వలసిన ప్రార్ధన చెయ్యాలి. ఉదాహరణకు - సూర్యుడికి సూర్య నమస్కారాలు చేస్తాము.తద్వారా - మన ఆరోగ్యం బాగుపడుతుందని మనకు తెలుసు. 

మీరు "ప్రహ్లాద్ జాని" గారిని గురింఛి విని వుంటారు.  

ఆయన - పూర్తిగా - సూర్య శక్తి ద్వారానే - తన ఆహారాన్ని సంపాదిం చుకుంటూ  వున్నారు. ఎన్నో ఏళ్ళు గా - భోజనం, నీళ్ళు లాంటివి తాకడము కూడా లేదు. 

ప్రహ్లాద్ జాని గురించి - వికిపీడియా లోను, చాలా వెబ్ సైట్లలోనూ - మనం చదువ వచ్చు.  ఇలాంటి వారు - చాలా మంది వున్నారు.

అంటే - సూర్య శక్తి ద్వారానే - భూమి కూడా - తన పనులు  తాను చెసుకుం టూ వున్నదని  తెలుస్తున్నది కదా.

సూర్యుడు మనకెన్నో యివ్వ గలిగిన సమర్థుడు. అడగ గలిగే - నేర్పు, వోర్పు, భక్తి  మనకుండాలి. అంతే. అలాగే - 

భూదేవి - మనకెన్నో యివ్వ గలిగిన సమర్థురాలు. చంద్రుడూ అంతే. వాయు దేవుడూ అంతే.  వాళ్ళను - ఎలా అడిగితే - ప్రసన్నులౌతారని, పతంజలి  మహర్షి తన యోగ సూత్రాలలో కూడా - విభూతి పాదం లో - చాలా బాగా చెప్పారు. మన ధ్యానానికి, ప్రార్థనకూ - చాలా, చాలా బలం వుంది.

మన సంస్కృతిలో - ఉదయం లేచిన వెంటనే-   కళ్ళు  తెరవకుండా, రెండు చేతుల తోనూ,  కళ్ళు మూసుకుని - క్రింది శ్లోకం చెబుతారు.

"కరాగ్రే, వసతే లక్ష్మీ, కర మూలే సరస్వతీ, కర మధ్యే భవేద్ గౌరీ, ప్రభాతే కర దర్శనం" 

అంటే - నా వేళ్ళ అంచుల లోనే - లక్ష్మీ దేవి వసిస్తూ వుంది. నా దగ్గరే లక్ష్మి దేవి వున్నప్పుడు - నాకం టే - భాగ్య వం తుడు ఎవరుంటారు. నేను, ఎవరికైనా సహాయం చేయడానికి - వీలుగా, నా వేళ్ళ అంచుల లోనే లక్ష్మీ మాత సర్వదా వసిస్తూ వుంది.

చేతి మొదటి భాగం లో - చదువుల తల్లి సరస్వతి వుంది.

చేతి మధ్యలో - అన్ని మంగళాలనూ,  శుభాలనూ - యిచ్చే తల్లి, సర్వ మంగళ -  గౌరీ దేవి వుంది.

అన్నీ వున్న వాడిని / దానను నేను - అన్న సంతృప్తితో తెల్ల వారి కళ్ళు తెరిచే సంప్రదాయం మనది.

సరే - మన పూజలు, వ్రతాలు ఎన్నో, ఎన్నెన్నో.

-పెద్ద, పెద్ద యాగాలూ, యజ్ఞాలూ కూడా -  ఈ కోవ లోకే వచ్చినా - మనం రోజు వారీ చేసే, ఈ చిన్ని యజ్ఞాలు ప్రకృతి శ క్తులైన - ప్రతి దేవతకూ - పరమ ప్రీతి పాత్రమైనవి.

అన్ని ప్రార్థనల లోను - అంతర్భాగంగా - అంతిమ భాగం గా మనం చెప్పే మాటలు, కోరే వరాలు  -

"సర్వే జనాః  సుఖినో భవంతు"  ;

"లోకాః సమస్తాః సుఖినో భవంతు" ;

యివి - మనం దేవతలనడిగే వరాలు.
దేవతలకు ప్రీతి పాత్రమైనవి - ప్రార్థన, పూజ, లాంటివి , వారికి సమర్పిం ఛి, వారిని మనం అడిగే యజ్న ఫలాలు యివి.

= వొక్కటి మాత్రం మనం జ్ఞాపకం వుం చుకోవాలి. 

ప్రపం చ యుద్ధానికైనా, తాజ మహాలు  కట్టాలన్నా మన మనస్సులో  వచ్చే దృఢమైన ఆలోచనలే పునాది.

దేవ యజ్ఞం - మం గళ కరమైన - అన్ని పనులకూ మనం వేసే గట్టి పునాది.

అది ఎప్పుడు చెయ్యాలి? యిప్పుడే. ఎప్పుడైనా. ప్రతి రోజూ.

 ముఖ్యం గా - ఉదయం; సాయంకాలం; రాత్రి పడుకునే ముందు.  నిర్మలమైన, నిస్స్వార్థమైన మనస్సుతో. 
అందరి కోసం

- అందరిలో మీరూ ఉన్నారుగా.  సకల శుభాలు మీకూ కలుగుతాయి.

.  .  . మరో యజ్ఞం, మరో వ్యాసంలో.

= మీ

వుప్పలధడియం విజయమోహన్