22, ఏప్రిల్ 2014, మంగళవారం

ఎలెక్షన్లు - మనమేం చెయ్యాలి ? - జాతీయ నాయకుడు - అంటే - నరేంద్ర మోడీ వొక్కరే - జయప్రకాశ్ నారాయణ్ గారు, చంద్ర బాబు గారు

ఎలెక్షన్లు - మనమేం చెయ్యాలి ?

 


వొకప్పట్లో -వీడు మంచి వాడా, వాడు మంచి వాడా, ,ఎవడు చెడ్డవాడు, ఎందుకు - ఇలాంటి చర్చలు ఎక్కువగా జరిగేవి . అప్పట్లో, సమాజంలో కూడా మంచి వాళ్ళే కాస్త ఎక్కువగా వుండే వాళ్ళు .

యిప్పుడు అటువంటి చర్చలు తక్కువ. ఎవడు "మన" వాడు, మన కులం వాడు , మన మతం వాడు - మన కులం వాడు, మన మతం వాడు ఎంత వెధవైనా, మనం వాడినే సపోర్టు చెయ్యాలి - ఇలాంటి సిద్ధాంతాలు , పట్టుదలలు ఎక్కువై పోతున్నాయి .

యిది మనకు యెలెక్షన్లలో  మరీ ఎక్కువగా కనిపిస్తుంది .

ఫలానా వాడికి ఎంత మంది సపోర్టు - అంటే - వాడి కులం వాళ్ళు ఎంత మంది,   అన్నప్రశ్న ప్రముఖంగా కనిపిస్తుంది . మరి కొంత మంది విషయంలో, వాళ్ళ మతం వాళ్ళు ఎంత మంది అన్న ప్రశ్న ప్రముఖంగా కనిపిస్తుంది .

యిది మారాలి . మార్చాలి . మంచి వాడికి వోటు అన్న భావన,  రావాలి . వస్తుందా ? ఏమో . కనీసం మీరూ   ,నేనూ, మంచి వాళ్లకు వోటు వేద్దామా .

 నాకేమో నరేంద్ర మోడీ గారు , జయప్రకాశ్ నారాయణ్ గారు, చంద్ర బాబు గారు మంచి వాళ్ళు అన్న నమ్మకం  చాలా ఎక్కువ . చంద్రబాబు గారు మన రాష్ట్రానికి  బాగా మేలు చెయ్యగల వ్యక్తి  అని వొక నమ్మకం .

అయితే  ,BJP పార్టీలో కొంత మంది బాగా మారాలి . వాళ్ళలోని మత మౌడ్హ్యం, మాట కాఠిన్యం రెండూ పోవాలి . అలాగే ముస్లిం పార్టీలలో కూడా యిది చాలా ఎక్కువ . వాళ్ళ లోనూ - యిది పోవాలి . కాంగ్రెస్ లాంటి పార్టీ లయితే - ఎప్పుడూ లంచగొండి తనానికి జై - అంటూ వున్నాయి . అది - చాలా, చాలా మారాలి . యిలా వొక్కొక్క పార్టీలో  వొక్కొక్క నకారాత్మకత  ఎక్కువగా వుంది .

సరే . పార్టీల సంగతి ప్రక్కన బెట్టి - నాయకుల సంగతి చూస్తే -

నరేంద్ర మోడీ లాగా, దేశమంతా  కనీసం తిరిగి ప్రతి రాష్ట్రంలోనూ, మాట్లాడిన నాయకుడు కూడా మరొకరు లేరాయె .  జాతీయ నాయకుడు - అంటే - రోజు వరకు ఆయన వొక్కరే . మరొకరు లేరు. రాహుల్ గాంధీ గారిలో  పెద్దగా నాయకత్వ లక్షణాలు లేవు . అరవింద్ కేజ్రీవాల్ గారిలో కూడా వొక ప్రధాన మంత్రి కి కావలసిన లక్షణాలు లేవు . ఆయన ఉద్యమ వాది గా పనికొస్తారు . నాయకుడిగా కాదు . అంతే కాదు . ఆ యిద్దరూ , దేశంలో - ఎక్కడ ఏ రాష్ట్రం వుందో కూడా యిప్పటి వరకు చూడ లేదు . కాబట్టి యిప్పట్లో , దేశానికి ప్రధాన మంత్రి కాగల అర్హత మోడీ గారికి మాత్రమే వుందనడంలో నాకు సందేహం లేదు .

ఆయనను గురించి కాంగ్రెస్ వారు మాటిమాటికీ చెప్పే వన్నీ తప్పులే అని చాలాసార్లు నిరూపితమయ్యాయి .

నేను ఆయన ప్రసంగాలు , ఆయన ప్రెస్ interviews  చాలా విన్నాను . ఆయనలాగా చాలా సహేతుకంగా , దేశీయతా వాది గా, పూర్తీ నిజాయితీగా - మాట్లాడిన  మరెవరినీ నేను చూడ లేదు ; వినలేదు.  మీరంతా కూడా - వోటు వేసే ముందు - ఆయన  హిందీ లో ఆప్ కీ అదాలత్  అన్న ప్రోగ్రాము లో - ఇండియా టీవీ  వారు అడిగిన ఎన్నో ప్రశ్నలకు యిచ్చిన జవాబులు  వింటే - బాగుంటుంది . అలాగే - ANI అన్న వార్తా సంస్థకు కూడా ఆయన యిచ్చిన జవాబులు విని తీరాల్సినవి . ఆయన ప్రధాన మంత్రి అయితే - BJP లో కూడా చాలా మంది బాగా మారుతారు. కనీసం అందుకయినా - ఆయన పార్టీకి వోటు వెయ్యాలి .

మిగతా ఎంత మంది నాయకులు మాట్లాడినవి  విన్నా - మోడీ గారిలో వున్నా నిజాయితీ , మానవతా దృక్పథం నాకెక్కడా కనిపించ లేదు .

సరే . మన రాష్ట్రంలో చంద్ర బాబుగారు , జయప్రకాశ్ నారాయణ్ గారు గొప్ప నాయకులే . వారు రాష్ట్రంలో గెలిస్తే - రాష్ట్రం (యిరు వైపులా ) బాగు పడుతుంది . మొత్తానికి రాజకీయాలకు పట్టిన  కాస్తయినా తొలగాలంటే - వీరు  వొస్తే  మేలు అని నా అభిప్రాయం . రాష్ట్రం బాగు పడడానికి చంద్ర బాబు గారిని నమ్మొచ్చు . ఆయన లాగా అభివృద్ధి ప్రణాళికలు వెయ్య గలిగే వారు, వాటిని సమర్థవంతంగా పూర్తీ చెయ్యగలిగే వారు చాలా అరుదు .

మరి వారి, వారి యిష్టం వారిది . మీ యిష్టం మీది .

సర్వే  జనాః సుఖినో భవంతు

= మీ

వుప్పలధడియం విజయమోహన్






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి